Saturday, May 4, 2024
- Advertisement -

చంద్ర‌బాబుపై పోటీకీ పార్టీ త‌రుపున అభ్య‌ర్తిని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌….

- Advertisement -

చంద్ర‌బాబు నాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం పాదాయ‌త్ర చిత్తూరు జిల్లాలో జ‌రుగుతోంది. పాద‌యాత్ర‌లో ముందుగానే 2019 ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌రుపున అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టిస్తూ జ‌గ‌న్ ముందుకెల్తున్నారు.

క‌ర్నూలు జిల్లా పాద‌యాత్ర‌లో ప‌త్తికొండ నియోవ‌ర్గం అభ్య‌ర్తిగా శ్రీదేవిని ప్ర‌క‌టించిన జ‌గ‌న్ ఇప్పుడు చంద్ర‌బాబుకు పోటీగా మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని కుప్పం నుంచి అభ్యర్థిగా ప్రకటించి జగన్ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం తీసుకున్నారు. గత మూడు పర్యాయాలుగా చంద్రబాబుపై పోటీ చేసిన సుబ్రమణ్యం రెడ్డి ఇప్పుడు వైకాపాకు రాజీనామా చేయడంతో.. వైసీపీ త‌రుపున చంద్రమౌళిని ప్ర‌క‌టించారు.

వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు కుప్పం నుంచే మొదలు కావాలని, పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త చంద్ర‌మౌళికి ఓటు వేసి గెలిపిస్తే కేబినెట్‌లో కూర్చోబెట్టి చంద్ర‌బాబు కంటే మెరుగ్గా అభివృద్ధి చేస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. పాదయాత్ర అనంతరం సెప్టెంబర్‌లో బస్సుయాత్ర మొదలు అవుతుందని, ఆ సందర్భంగా కుప్పం వచ్చి ప్రతి మండలంలోనూ పర్యటిస్తానని ఆయన తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -