Thursday, May 2, 2024
- Advertisement -

శ‌వాల‌పై చిల్ల‌ర ఏరుకొనే త‌త్వం చంద్ర‌బాబుది…

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర చివ‌రి ద‌శ‌కు చేరింది. ప్ర‌స్తుతం శ్రీకాకులం జిల్లాలో కొన‌సాగుతున్న ప్ర‌జాయాత్ర‌లో భాగంగా పాల‌కొండ‌లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌బ‌లో జ‌గ‌న్ బాబు, టీడీపీ ప్ర‌భుత్వంపై మాట‌ల తూటాలు పేల్చారు. ఇటీవ‌ల సంభ‌వించిన తిత్లీ తుఫాను బాధితుల‌కు పూర్తి స‌హాయం చేశామ‌ని బాబు సొంత డ‌బ్బాకొట్టుకుంటున్నాడని ఎద్దేవ చేశారు. బాధితులకు సాయం చేసినట్లు ప్రచార ఆర్భాటం తప్ప.. ఆదుకున్న పాపాన పోలేదన్నారు.

తుపాను హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకోలేదు. తుపాను వచ్చిన పది రోజులకు అధికారులు వచ్చి లెక్కలు వేశారు. అంత భారీ నష్టం జరిగిందన్న చంద్రబాబు రూ. 520 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఆయన చెప్పిన నష్టంలో 15 శాతం కూడా ఇవ్వలేదు. ఇచ్చిన రూ. 520 కోట్లలో కూడా రూ. 210 కోట్లే ఖర్చు చేశార‌ని విమ‌ర్శ‌లు చేశారు.

పైగా ప్రచారాన్ని కోటలు దాటిస్తూ.. ఆర్టీసీ బస్సులపై ఫోటోలు, ఫ్లైక్సీలతో ప్రచారం చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. నిజంగా చంద్రబాబు తీరు చూస్తుంటే శవాలపై చిల్లర ఏరుకునే విధంగా ఉంది. ఆ దేవుడి ఆశీస్సులు.. మీ దీవెనలతో మన అందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. జగన్‌ అనే నేను.. ఆ 3,435 కోట్లలో ప్రతిరూపాయి ఇస్తానని హామీ ఇస్తున్నాను.’ అని తెలిపారు.

పాలకొండలోనూ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు ప్రతిపక్ష నేత. తాగే నీళ్లు కూడా లేక ప్రజలు తిప్పలు పడుతున్నారని.. డ్రైనేజ్ నీళ్ల కంటే దారుణంగా ఉన్న నీటిని ఉన్నవాటిని ఎలా తాగాలని ప్రశ్నించారు. వైద్య సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయి.. 100 పడకల ఏరియా ఆసుపత్రిలో లంచాలివ్వంది ప్రసవాలు కూడా చేయని పరిస్థితి ఉందని విమర్శించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -