వచ్చేనెల మూడో తేదీ నుంచి తన యాత్రను తిరిగి ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు వైసీపీ అధినేత జగన్. ప్రస్తుతం జగన్ ప్రజాసంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో కొనసాగుతుంది. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలో జగన్ పాదయాత్ర పూర్తి చేసి… నవంబర్ 4న పార్వతీ పురం నియోజకవర్గం సీతానగరం మండలం బగ్గందొరవలసలో యాత్ర ప్రారంభిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 6వ తేదీన జగన్ పార్వతీపురంలో బహిరంగ సభ నిర్వహిస్తారని విజయనగరం జిల్లా వైసీపీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తెలిపారు.
ఇదే విషయాన్ని ఆపార్టీనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు త్వరలోనే ఉన్నాయని అప్పుడు ప్రజలే ఆయనను ఇంటికి పంపుతారన్నారు. భుత్వాన్ని గద్దె దించాలన్న ఆలోచన తమకు లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు.
జగన్ పై దాడి జరగగానే నిందితుడిని తొలుత సీఐఎస్ఎఫ్ పట్టుకుని పోలీసులకు అప్పగించిందనీ, అధికారులు సైతం అప్పుడే కేసు నమోదుచేశారని తెలిపారు. కత్తి దాడితో భయపడిపోయి జగన్ ఇంట్లో కూర్చునే రకం కాదనీ, త్వరలోనే కోలుకుని ఆయన ప్రజా సంకల్పయాత్రలో పాల్గొంటారని వెల్లడించారు.