Friday, April 26, 2024
- Advertisement -

అలా మాట్లాడ‌డానికి బాబుకు సిగ్గుండాలి…వైఎస్ జ‌గ‌న్‌

- Advertisement -

తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాల నేపథ్యంలో వైఎస్ జ‌గ‌న్ చంద్ర‌బాబుపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు బాబు సిగ్గుతో త‌ల‌వంచుకోవాల్సిన ప‌రిస్థితి. బాబు హ‌స్తం ఎక్క‌డ పెట్టినా అది భ‌స్మాసుర హ‌స్తం అని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలతో ఈ విషయం దేశం మొత్తం అర్థమైందన్నారు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా.. ఆముదాల వలసలో జరిగిన సభలో మాట్లాడిన జగన్ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో స్పందించారు. అనైతిక పొత్తుపై తెలంగాణ ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని వ్యాఖ్యానించారు జగన్. ఏం చెప్పినా నమ్ముతారనుకునే పార్టీలకు తెలంగాణ ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు. అన్యాయమైన రాజకీయాలు చేస్తే జనం నమ్మరని రుజవయ్యిందన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు యుద్దం చేస్తున్నారా? లేక ఆయన ఎల్లో మీడియా యుద్దం చేస్తుందా? అనిపించింది. గత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 24, టీడీపీకి 15 శాతం ఓట్లు రాగా.. అధికారం దక్కించుకున్న టీఆర్‌ఎస్‌కు 34 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీ, కాంగ్రెస్‌లు కలిస్తే 39 శాతం ఓట్లు వస్తాయని చంద్రబాబు అనుకున్నారు. చంద్రబాబు, కాంగ్రెస్‌లు కలిసి 5 శాతం ముందంజలో ఉండి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఈ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు.

హరికృష్ణ భౌతికకాయం పక్కనే పెట్టుకుని టీఆర్ఎస్ నేతలతో పొత్తుల గురించి మాట్లాడిన చంద్రబాబు.. వారు తిరస్కరించడంతో సిగ్గులేకుండా బద్ద శత్రువైన కాంగ్రెస్‌తో బాబు జతకట్టారని విమర్శించారు. ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చే బాబును ఎవరు నమ్ముతారన్నారు జగన్.

గతంలో చంద్రబాబుది దుష్టపాలన అన్న కాంగ్రెస్‌.. 5 నెలల క్రితం ఆయన నాలుగేళ్ల అవినీతి పాలన గురించి చార్జ్‌షీట్‌ అనే పుస్తకాన్ని విడుదల చేసింది. తీరా తెలంగాణ ఎన్నికల్లో అదే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌‌తో చంద్రబాబులు ఇద్దరూ.. కలిసి వేదికను పంచుకున్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే జనాలు ఎలా నమ్ముతారంటూ జ‌గ‌న్ విరుచుకు ప‌డ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -