Friday, May 17, 2024
- Advertisement -

మోదీగారు ఇప్ప‌టికైనా స్పందించండి…వైఎస్ జ‌గ‌న్ ట్వీట్‌

- Advertisement -

ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో చేస్తున్న దీక్షకు సంబంధించి ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి మరోసారి స్పందించారు. ఎంపీల ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరిందని, పలువురు ఎంపీల ఆరోగ్యం బాగా క్షీణించిందని ఆయన ట్వీట్ చేశారు. ఏపీ ప్రజల భవిష్యత్తు సందిగ్ధంలో పడిన వేళ హోదాపై చేసిన ప్రమాణాన్ని ఇకనైనా నిలబెట్టుకోండి అని ప్రధాని మోదీని కోరారు.

తమ ఎంపిలు ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టి సోమవారానికి నాలుగు రోజులైందన్నారు. ఇప్పటికే మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, వైవి సుబ్బారెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన విషయాన్ని కూడా జగన్ ప్రధానికి వివరించారు.

కాబట్టి ఏపి భవిష్యత్తు కోసం, ప్రజల ఆకాంక్షలమేరకు గతంలో హామీ ఇచ్చినట్లు ప్రత్యేకహోదా ప్రకటించాలన్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -