Friday, April 26, 2024
- Advertisement -

నేడు సీఎం జగన్ ఢిల్లీ పయణం.. కేంద్ర మంత్రులతో భేటీ!

- Advertisement -

గత కొంత కాలంగా ఏపిలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి కూడా కుంటు పడింది. రాష్ట్రంలో జరగుతున్న రాజకీయల గురించి చర్చించడానికి.. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పెండింగు నిధులు, హైకోర్టు తరలింపు తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. రాజకీయ పరిణామాలను అమిత్ షాకు జగన్ వివరిస్తారని తెలుస్తోంది.

అలాగే, రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయం కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే కొన్ని రోజులుగా ఏపిలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడంపై సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -