వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో దూసుకుపోతున్నారు. ప్రజలనుంచి వస్తున్న స్పందనను చూసి మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రతీ సామాజికి వర్గాన్ని దగ్గర చేసుకొనేందుకు వారికోసం పథకాలను ప్రకటిస్తున్నారు.
ప్రత్యేక హోదా ఉద్యమానికి సై అంటూనే, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి దూసుకుపోతున్నాడు. ఇక టీడీపీ అధికారం కోల్పోతుందా అన్న విషయం పక్కన పెడితే,జగన్ గెలిస్తే మాత్రం ప్రజా సంకల్ప యాత్రలో ప్రకటిస్తున్న పథకాలన్నీ అమలు చేయటం సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో విద్యార్ధులు, యువత, నిరుద్యోగులు ప్రధానం కానున్నారు. అందుకే వారికోసం పలు పథకాలను ప్రకటిస్తున్నారు. విద్యార్థులకు జటన్ బంఫర్ ఆఫర్ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడితే తప్పకుండా ప్రతీ విద్యార్థికి 15 వేల చొప్పున స్కాలర్ షిప్ ఇస్తామని స్పష్టం చేశాడు.పేద విద్యార్థులు చదువుకునేందుకు ఎన్ని లక్షలైనా భరిస్తానని,హాస్టల్ చార్జీల కింద ఒక్కొక్కరికి 20 వేలు ఇస్తామని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు 15 వేలు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించాడు. దీంతో జగన్ సీఎం అవడం ఖాయం.