ఏపీలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల నేపథ్యంలో ఏపీలో మైకులన్నీ మూగబోయాయి. వైఎస్ జగన్ ఇప్పటి వరకు 13 జిల్లాల్లో 68 నియోజకవర్గాల్లో పర్యటించించారు. ఇడుపులపాయలో పార్టీ తరుపున అభ్యర్ధులను ప్రకటించి ప్రారంభించిన ఎన్నికల ప్రచారాన్ని తిరుపతిలో ముగించారు. 20 రోజులపాటు 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని సభల్లో ఆయన పాల్గొన్నారు.
*అనంతపురం జిల్లాలో 6 నియోజకవర్గాలు
*కర్నూల్ జిల్లాలో 6 నియోజకవర్గాలు
*కడప జిల్లాలో 5 నియోజకవర్గాలు
*చిత్తూరు జిల్లాలో 5 నియోజకవర్గాలు
*నెల్లూరు జిల్లాలో 3 నియోజకవర్గాలు
*ప్రకాశం జిల్లాలో 5 నియోజకవర్గాలు
*గుంటూరు జిల్లాలో 6 నియోజకవర్గాలు
*కృష్ణా జిల్లాలో 6 నియోజకవర్గాలు
*పశ్చిమగోదావరి జిల్లాలో 6 నియోజకవర్గాలు
*తూర్పుగోదావరి జిల్లాలో 7 నియోజకవర్గాలు
*విశాఖ జిల్లాలో 6 నియోజకవర్గాలు
*విజయనగరం జిల్లాలో 3 నియోజకవర్గాలు
*శ్రీకాకుళం జిల్లాలో 2 నియోజకవర్గాలు