Sunday, May 19, 2024
- Advertisement -

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో

- Advertisement -

రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రణాళిక వచ్చేసింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రస్తుతం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

మేనిఫెస్టో ముఖ్యాంశాలు…
: ఉగాది సందర్భంగా మేనిఫెస్టోను విడుదల చేస్తుండటం ఎంతో ఆనందదాయకం
: కొత్త యుగానికి, కొత్త అధ్యాయానికి నాంది పలికే రోజు ఇది.
: ఓ పెద్ద పాంప్లెట్ సైజ్ లో వైసీపీ మేనిఫెస్టో.
: జగన్ ప్రకటించిన నవరత్నాలన్నీ మేనిఫెస్టోలో అంశాలు.
: అదనంగా మరిన్ని అంశాలు.
: ప్రతి రైతు కుటుంబానికీ పెట్టుబడి కోసం రూ. 50 వేలు.
: పంట వేసే సమయానికే మే నెలలో రూ. 12,500.
: పంట బీమా కోసం చెల్లించాల్సిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
: ఉచిత బోర్లు, పగటి పూట 9 గంటల కరెంట్, ఆక్వా రైతులకు యూనిట్ రూ. 1.50కే విద్యుత్.
: రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
: పంట వేసే ముందే రేటు, గిట్టుబాటు ధరకు గ్యారంటీ.
: రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తు నిధి.
: ప్రతి నియోజకవర్గంలో శీతలీకరణ గిడ్డంగి.
: రెండో ఏడాది నుంచి సహకార రైతుకు పాలు ఇచ్చే పాడి రైతుకు లీటరుకు రూ. 4 బోనస్.
: ప్రమాదమైనా, ఆత్మహత్య అయినా రూ. 7 లక్షల బీమా.
: ఆ డబ్బు అప్పుల వాళ్లకు చెందకుండా అసెంబ్లీలో చట్టం.
: కౌలు రైతులకు వడ్డీ లేని రుణాలు. పంటకు సంబంధించిన రాయితీలు, ప్రయోజనాలు.
: వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ అమలు.
: అన్ని వర్గాలకూ వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే పథకం అమలు.
: ఎన్ని లక్షలు ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది.
: ఏ ప్రాంతంలో చికిత్స చేయించుకున్నా ఉచితమే.
: చికిత్స తరువాత కోలుకునేంత వరకూ కుటుంబానికి సాయం.
: పిల్లల చదువులన్నీ ఉచితం.
: బిడ్డను బడికి పంపే తల్లికి సంవత్సరానికి రూ. 15 వేలు.
: పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు వసతి కోసం విద్యార్థికి ఏటా రూ. 20 వేలు.
: పెన్షన్ల అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గింపు.
: వికలాంగులకు, వృద్ధులకు రూ. 3 వేల పెన్షన్.
: ఐదేళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లు.
: స్థలం లేని వారికి ఉచిత స్థలం. మహిళల పేరిట రిజిస్ట్రేషన్.
: ప్రత్యేక హోదా వచ్చేంత వరకూ అలుపెరగని పోరు.
: ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు.
: 50 ఇళ్లకు ఒకరి చొప్పున నెలకు రూ. 5 వేల గౌరవ వేతనంతో వాలంటీర్ల నియామకం.
: అన్ని ప్రభుత్వ పథకాలనూ ఇంటి వద్దకే చేరుస్తాం
: ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ఏర్పాటు
: గవర్నమెంట్ కాంట్రాక్టులు నిరుద్యోగ యువతకు ఇచ్చేలా చట్ట సవరణ.
: సబ్సిడీపై యువతకు కావాల్సిన మౌలిక వసతులు.
: వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళల రుణాలు దశలవారీగా మాఫీ
: మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు.
: మూడు దశల్లో మద్యపాన నిషేధం.
: మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితం చేస్తాం.
: అగ్రీ గోల్డ్ బాధితులకు రూ. 1100 కోట్ల కేటాయింపు.
: తిరుమల శ్రీవారి ఆలయం తలుపులను సన్నిధి గొల్లలు తెరిచే సంప్రదాయ పునరుద్ధరణ.
: సొంత ఆటో, టాక్సీ నడిపేవారికి సంవత్సరానికి రూ. 10 వేలు.
; 18 నుంచి 60 ఏళ్ల వయసువారికి రూ. లక్ష బీమా
: సహజమరణమైనా కుటుంబానికి ఆ డబ్బు చెల్లిస్తాం.
: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు పారదర్శకంగా ఉండేలా చూస్తాం.
: ఎస్సీ, ఎస్టీ కాలనీలు, గిరిజన తాండాల్లో ఏడాదికి 2 వేల యూనిట్ల ఉచిత కరెంట్ లేదా రూ. 6 వేలు.
: ప్రతి ఐటీడీఏ పరిధిలో ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
: గిరిజనులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన అన్ని హామీల అమలు.
: మాతృభాష పరిరక్షణకై విద్యార్థులకు తెలుగు తప్పనిసరి.
: జర్నలిస్టులకు వారి ప్రాంతాల్లోనే ఇంటి స్థలాలు.
: అర్చకుల పదవీ విరమణ నిబంధన రద్దు.
: అర్చకులకు ఇళ్ల స్థలాల కేటాయింపు.
: దేవాలయాల్లో ధూప, దీప నైవేద్యాల కోసం నిధులు.
: దేవాలయాలకు పంచాయతీ జనాభా ప్రకారం రూ. 10 వేల నుంచి రూ. 35 వేలు.
: మైనారిటీల ఆస్తులను సర్వే చేయించి డిజిటలైజేషన్.
: ప్రభుత్వ ఉద్యోగుల ఇబ్బందులు తొలగించేందుకు కృషి.
: సీపీఎస్ ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ.
: ఉద్యోగులు కోరుకున్న విధంగా 26 శాతం ఐఆర్, సకాలంలో పీఆర్సీ అమలు.
: అన్ని ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్.
: సీనియారిటీ, అర్హతలను బట్టి రెగ్యులరైజేషన్.
: పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు.
: ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణం.
: అంగన్ వాడీ, ఆశా వర్కర్లకు తెలంగాణ ఇస్తున్న వేతనం కన్నా రూ. 1000 అదనంగా జీతం.
: ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలం లేకుంటే, వారి ప్రాంతంలో ఇళ్ల స్థలం.
: పరిశ్రమల కోసం మరిన్ని ప్రోత్సాహకాలు.
: నిరుద్యోగ యువకులకు సబ్సిడీ ఇచ్చి పరిశ్రమలు పెట్టిస్తాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -