Thursday, April 25, 2024
- Advertisement -

ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి ఖరారు

- Advertisement -

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధి ఖరారయ్యారు. ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి పేరును మేకపాటి కుటుంబం ఖరారు చేసింది. ఇదే విషయంపై మేకపాటి కుటుంబంతో చర్చించిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మేకపాటి విక్రమ్ రెడ్డి ఊటీలోని గుడ్ షెఫర్డ్ పబ్లిక్ స్కూల్ లో విద్యాభ్యాసం చేశారు.

ఐఐటీ చెన్నైలో సివిల్ సబ్జెక్టులో బీటెక్ పూర్తి చేసి.. అమెరికాలో కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ లో ఎంఎస్ చదివారు. మేకపాటి విక్రమ్ రెడ్డి సైతం అచ్చు గుద్దినట్టుగా గౌతమ్ రెడ్డి లాగానే ఉంటారు. గౌతమ్ సోదరుడు అయిన విక్రమ్ రెడ్డి .. రాజమోహన్ రెడ్డి రెండో కుమారుడు. గౌతమ్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం నుంచి కేఎంసీ సంస్థకు విక్రమ్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

గౌతమ్ మరణంతో ఆయన సతీమణి శ్రీ కీర్తి ఆత్మకూరు నుంచి బరిలో ఉంటారనే ప్రచారం సాగింది. కానీ మేకపాటి కుటుంబం నిర్ణయం మేరకే ముందుకు వెళ్లాలని సీఎం నిర్ణయించటంతో.. కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబంలో అందరూ చరర్చించి రానున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో విక్రమ్ రెడ్డిని బరిలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు.

రోజాకు బంఫర్ ఛాన్స్

వైసీపీలో అసంతృప్తి సెగలు

మరోసారి ఏచూరికే ఛాన్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -