Sunday, May 12, 2024
- Advertisement -

వ‌ల‌స‌ల‌ను ఆప‌డంలో జ‌గ‌న్ ఘోరంగా ఫేయిల్‌…

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ నుంచి అధికార‌పార్టీలోకి వ‌ల‌స‌లు ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్ పార్టీని నిర్వీర్యం చేయ‌డంలో బాబు ప్లాన్‌లు ఫ‌లిస్తున్నాయి. వ‌ల‌స‌ల ద్వారా ఎంత‌మందిని పార్టీలో చేర్చుకున్నా బాబు దాహం తీర‌న‌ట్టుంది. అందుకె ఇప్ప‌టికీ ఫిరాయింపుల‌ను య‌దేచ్ఛ‌గా ప్రోత్స‌హిస్తున్నారు.

తాజాగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి కూడా టీడీపీలోకి వెల్ల‌డం ఖాయం అన్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా ఆత్మవిశ్వాసంపై జగన్‌, విజయసాయిరెడ్డి దెబ్బకొట్టారు…’ అంటూ పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన ముఖ్య అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

విష‌యం తెలిసిన వెంట‌నె జ‌గ‌న్  రంగంలోకి దిగారు. గురువారం నుంచి ఆయన, విజయసాయిరెడ్డి, మరో ముఖ్య నేత బొత్స ఆమెకు తరచూ ఫోన్లు చేస్తూ బుజ్జగింపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈశ్వరిని స‌ముదాయించేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌డంల‌ద‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. వైసీపీలోనే కొనసాగితే జరిగే నష్టం.. అధికార టీడీపీలో చేరితే గిరిజన ప్రాంతానికి చేకూరే ప్రయోజనాలను అధికార‌పార్టీ న‌తేలు వివరించారు.

జ‌గ‌న్ మొద‌టి నుంచి వ‌ల‌స‌ల‌ను ఆప‌డంలో విఫ‌ల‌మ‌వుతూనె ఉన్నారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో భ‌రోసాని క‌ల్పించ‌లేక‌పోతున్నారు.ఇప్ప‌టికె 22 మంది ఎమ్మెల్యేలు టీడీపీ కండువా పుచ్చుకున్నారు. ఇప్ప‌టికి కూడా జ‌గ‌న్ మేలుకోవ‌డంలేద‌ని తెలుస్తోంది. ఇప్పుడు కూడా ఏదో ఫిరాయింపు సిద్దంగా ఉన్న నేత‌ల‌ను తూతూ మంత్రంగా బుజ్జ‌గించ‌డం త‌ప్ప సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు క‌నిపించ‌డంలేదు. ఇప్ప‌టికైన సీరియ‌స్‌గా తీసుకోక‌పోతె భ‌విష్య‌త్తులో పార్టీలో ఎవ‌రూ మిగిలేట‌ట్టులేరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -