నంద్యాల ఎలక్షన్ తరవాత వైసీపీ శ్రేణులు డీలా పడ్డారు. అయితే జగన్ మోహన్ రెడ్డి కంటే పార్టీ కేడర్ మాత్రమె ఎక్కువగా ఈ డిప్రెషన్ లో కనిపిస్తోంది. జగన్లో ఉన్న వేడి ఏమాత్రం తగ్గడంలేదు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా వాటికి ఎదురెలుతూ ప్రజలు, పార్టీ నాయకులమీద విశ్వాసంతో పాజిటివ్ గా ఉంటూ ముందుకెల్తున్నారు. ఫలితాలు వచ్చిన రెండు రోజుల్లో కాస్త కళత చెందినా మళ్లీ పుంజుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ సూచనతో ఆ పార్టీ వైఎస్సార్ ఫామిలీ , వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీన్ని విజయవంతం చేసేందుకు జగన్తోపాటు పార్టీ నాయకులు,కార్యకర్తలు తీవ్రంగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా వైకాపా అందరికీ ఒక నెంబర్ ని ఇస్తోంది, అది నేరుగా వైకాపా పార్టీ కార్యాలయం కి వెళుతుంది. సమస్య గురించి చెప్పుకోవాలి అంటే చెప్పుకోవచ్చు లేదా పార్టీ సభ్యత్వం కోసం మన డిటైల్స్ ఇవ్వాలి.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నెంబర్కి ఫోన్ చేసి వారి సమస్యలు చెప్పుకుంటె దాన్ని నోట్ చేసుకుంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని పరిస్కరిస్తారు. అలాగే కాల్ చేసిన వాళ్ళకి ఆటొమేటిగ్గా పార్టీ సభ్యత్వం వచ్చేస్తుంది. నాలుగు లక్షల మంది మొదటి రోజునే చేరారు అంటూ హ్యాపీగా ఉంది వైసీపీ.
ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను వైకాపా సమస్యలని స్పాట్ లో ఎలా పరిష్కరిస్తుందో ఇంకా చెప్పలేదు. సో ఆ ఒక్క క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటున్నారు చాలామంది. ఈ విషయం లో వైకాపా క్లారిటీ ఇస్తే ‘వైఎస్ఆర్ కుటుంబం’ ప్రోగ్రాం సూపర్ డూపర్ హిట్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పచ్చు. అదే జరిగితె వైసీపీ మీద ప్రజలకు నమ్మకం పెరుగుతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి కలసి వస్తుంది.