- Advertisement -
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇన్నాల్లు ప్రత్యేకహోదాపై డ్రామాలాడుతున్న టీడీపీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. విధిలేని పరిస్థితుల్లో కేంద్రపై అవిశ్వాసం పెట్టడానికి సిద్దమయ్యారు బాబు. తాజాగా వైఎస్ జగన్ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. నాలుగేళ్లుగా కుంభకర్నుడిలాగా నిద్రపోయిన చంద్రబాబు ఇప్పుడు నిద్రలేచారని జగన్ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు జగన్. ప్రత్యేక హోదా కోసం వైసీపీ గత నాలుగేళ్లుగా ప్రజల సహకారంతో పోరాటం చేస్తోందని గుర్తు చేస్తూ, చివరకు ఈ విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని జాతికి తెలిసిందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులను కాపాడుకునేందుకు తమ పార్టీ పోరాడుతుందని అన్నారు. రాజకీయ కారణాలతోనే అయినా తమ అవిశ్వాసానికి టీడీపీ మద్దతిస్తానని చెప్పడం సంతోషకరమన్నారు జగన్.