వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో చంద్రబాబుపాలనపై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ప్రజాసంకల్పపాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. బాబు పాలనలో అవినీతి మాత్రమే జరుగుతుందంటూ చలోక్తులు విసిరారు. బాబు ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిందని ఆరోపించారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే స్థానిక పులిచింతలపాడు ప్రాజెక్ట్ వచ్చిందని.. చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాలనలో ఈ ప్రాజెక్టులో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు.
బాబు పాలనలో ఎమ్మెల్యే పదానికి కొత్తఅర్థం చెప్పారు జగన్. ఈమధ్య కాలంలో తెలుగులో ఓ సినిమా రిలీజ్ అయ్యిది. ఆ సినిమా పేరు ఎమ్మెల్యే. అక్కడ ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్ అని అర్థం. కాని మీ నియోజకవర్గానికి వచ్చేసరికి మాత్రం ఎమ్మెల్యే అంటే ‘మామూళ్లు లంచాలు తీసుకునే అబ్బాయ్’ అన్నట్లుగా పరిస్థితి తయారైందంటూ బాబుకు జగన్ పంచ్ విసిరారు.
రాష్ట్ర ప్రజల్ని దోచుకుని తింటూ.. ఎమ్మెల్యేలూ.. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు వాటాలు పంచుకుంటున్నారన్నారు. సీఎంకి ఇంత, చినబాబుకి ఇంత, ఎమ్మెల్యేలకు ఇంత అంటూ రేట్లు ఫిక్స్ చేసుకుని మరీ దోచుకుంటున్నారన్నారు. చంద్రబాబు పాలనలో చక్కగా జరిగింది అదొక్కటే. కేవలం అవినీతి మాత్రమే ఆయన హయాంలో సక్రమంగా జరిగిందంటూ ఇలాంటి నాయకుడి మాటలకు మరోసారి మోసపోవద్దంటూ పిలుపునిచ్చారు జగన్.