Monday, May 6, 2024
- Advertisement -

వాణీ విశ్వనాథ్ పై పోటీకి సిద్ధమే….

- Advertisement -

ప‌వ‌న్ మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర ప‌ర్య‌ట‌న చేస్తున్నారు. మొద‌ట‌గా విశాఖ డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఉద్యోగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ వారి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి ఉద్యోగుల చేస్తున్న దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలిపి ప్ర‌సంగించారు. వైఎస్ జ‌గ‌న్ మీద ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న చేసిన విమ‌ర్శ‌ల‌కు ధీటైన కౌంట‌ర్ ఇచ్చారు వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.

చిరంజీవి లేకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడ అని ఆమె ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం గతంలో ఆయన పిలుపునిచ్చారని, ఇప్పుడు దాని గురించి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. పవన్ కళ్యాణ్‌కు తమ పార్టీ అధినేత జగన్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.

ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై జ‌గ‌న్ కౌంట‌ర్ ఇచ్చిన త‌ర్వాత రోజా కౌంట‌ర్ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబును విమర్శించరని, ఆయనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వచ్చి అంత ఇంత మేలు చేసే దిశగానే ఇంతరవరకు ఆయన ప్రస్థానం కనిపించిందని కౌంటర్ ఇచ్చారు. పవన్ మొదట చంద్రబాబు నీడ నుంచి బయటకు రావాలన్నారు.

అబద్ధాలు చెప్పడం లో చంద్రబాబు దిట్ట అని ఆమె చెప్పారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ పాత్రలకు నంది అవార్డు ఇవ్వొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. టీడీపీ తరపున వాణీ విశ్వనాథ్ నిలబడితే ఆమెపై పోటీకి తాను సిద్ధమని రోజా ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -