Monday, April 29, 2024
- Advertisement -

మోదీ దీక్ష‌.. చంద్ర‌బాబు దీక్ష‌కు బేధం చెప్పిన రోజా

- Advertisement -

టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కరోజు దీక్షపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన చేపట్టినది నిరాహారదీక్ష కాదని, ఉపవాసదీక్ష అని ఎద్దేవా చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉంటే… దాన్ని ఉపవాసమనే అంటారని చెప్పారు.

పార్లమెంటులో మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి, ఏపీ భవన్ లో నిరాహారదీక్షకు దిగి ఉంటే… కేంద్రం కదిలివచ్చేదని అన్నారు. కానీ, టీడీపీ ఎంపీలు ఢిల్లీలో డ్రామాలు ఆడారని విమర్శించారు. విజయవాడలో మొన్న జగన్ కు జనాలు బ్రహ్మరథం పట్టారని… ఆ భయంతోనే చంద్రబాబు ఇప్పుడు దీక్షకు కూర్చున్నారని చెప్పారు. టిఫిన్లు చేసి వచ్చి దీక్షలు చేపడుతున్నారని ఎద్దేవా చేశారు.

ఇక చంద్రబాబు ఏడాది తిండి ఖర్చు రూ.8కోట్లు. కేవలం పుల్కాలు, కూరగాయలు తినేవాడికి ఇంత బడ్జెట్‌ అవసరమా?. సీరియస్‌గా దీక్ష చేయాల్సిందిపోయి ఎన్టీఆర్‌ డూప్‌లు పెట్టుకుని దీక్షలో కామెడీ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ లాంటి నేతను అవమానపరుస్తున్నారు.

పైసా ఖర్చు లేకుండా ప్రధాని మోదీ దీక్ష చేస్తే …చంద్రబాబు మాత్రం రూ.30కోట్ల ఖర్చుతో దీక్ష చేశారు. మిగితాదంతా సేమ్ టూ సేమ్ అని ఎద్దేవ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -