జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వైసీపీ నేత అంబటి రాంబాబు ఫైరయ్యారు. నాలుగు సంవత్సరాలు టీడీపీతో అంటకాగి ఇప్పుడు బయటకు వచ్చి జగన్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నేను నీతివంతుడుని బాబు ఎలా డబ్బా కొట్టుకుంటాడో అలాగే ఇప్పుడు నేను ఉత్తముడనని సొంతడబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నన్ని సీట్లు తనకు ఉండుంటే… ఒక ఊపు వూపేవాడినని పవన్ 2014 ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు.. చంద్రబాబు రాజ్యసభ సీటు ఇవ్వనందుకే టీడీపీ నుంచి బయటకు వచ్చారా..? అన్ని ఎద్దేవా చేశారు.
ఒకనొక సమయంలో రివాల్వర్ తో కాల్చుకుని చావాలనుకున్నానని సభల్లో పవన్ చెబుతున్నారని… జీవితంలో పోరాడలేక చావాలనుకున్న వ్యక్తిని ఎవరైనా ధైర్యవంతుడు అంటారా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన చంద్రబాబుకు ఎందుకు మద్దతు పలికారో పవన్ చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. వ్యక్తిగత అంశాల గురించి ప్రశ్నిస్తే పవన్ ఎందుకు భయపడుతున్నారని అన్నారు. ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. తన మాటలను పవన్ అదుపులో పెట్టుకోవాలని సూచించారు.