వైసీపీకి త్వరలోనే బిగ్షాక్ తలనుంది. ఆ పార్టీనుంచి జగన్ కు రైట్ హ్యండ్గా ఉన్న నేత సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. అధికారపార్టీ ప్రారంభించిన వలసలకు ఫుల్స్టాప్ పడేటట్లులేదు. పాదయాత్రలో టీడీపీలో ఉన్న పేరున్న లీడర్లను పార్టీలోకి చేర్చుకుంటుంటే..జగన్కు రైట్ హ్యాండ్గా ఉన్న వాళ్లు జగన్కు షాకిస్తూ టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.
వైసీపీలో ఇప్పటికే చాలా వికెట్లు పడగా తాజా వికెట్ జగన్ రైట్ హ్యాండ్దే కాబోతుంది. గత రెండు దశాబ్దాలుగా వైఎస్ ఫ్యామిలీ వెంటే నడుస్తోన్న ఆ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు జగన్పై తీవ్ర అసంతృప్తితో టీడీపీలో చేరనుంది. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి తాజాగా ఏపీ సీఎం చంద్రబాబును కలవడం అనంత రాజకీయవర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. గత సాధారణ ఎన్నికల్లో గురునాథరెడ్డి టీడీపీ అభ్యర్థి ప్రభాకర్ చౌదరి చేతిలో ఓడిపోయారు.
కొద్ది కాలంగా గురునాథరెడ్డి రాజకీయంగా స్తబ్దుగా ఉంటున్నారు. జగన్తో గ్యాప్ రావడంతోనే ఆయన పార్టీలో అంటీముట్టనట్టుగా ఉంటున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇక జగన్ తాజాగా గురునాథరెడ్డికి చెప్పకుండానే ఆయన్ను నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి తప్పించి మైనార్టీ నేత నదీమ్కు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి గురునాథరెడ్డి జగన్పై రగిలిపోతున్నారు.
ఇక తాజాగా గురునాథరెడ్డి చంద్రబాబుతో భేటీ అయ్యారు. బాబు కూడా ఆయన ఫ్యామిలీ టీడీపీలో చేరేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉంటే అనంతపురం ఎంపీ దివాకర్రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరికి అస్సలు పొసగడం లేదు. జేసీని ప్రభాకర్చౌదరి అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ చౌదరిని టార్గెట్ చేసేందుకు జేసీ దివాకర్రెడ్డి పట్టుబట్టి మరీ టీడీపీలోకి తీసుకువస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.