Thursday, May 2, 2024
- Advertisement -

రాజకీయంగా కలకలం రేపుతున్న జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ‌ నార్నె వ్యాఖ్య‌లు

- Advertisement -

రాష్ట్రంలో ఇప్పుడు మంగ‌ళ‌గిరి సీటు హాట్ హాట్‌గా మారింది. ఈ సీటునుంచి పోటీ చేస్తున్న వ్య‌క్తులు సామాన్యులుకాదు. ఇద్ద‌రు బంధువులే. ఒకరు సీఎం చంద్ర‌బాబు పుత్ర‌ర‌త్నం లోకేష్‌, మ‌రో క‌రు జూనియ‌ర్ ఎన్టీఆర్ మామ నార్నెశ్రీనివాస‌రావు. అంద‌రి చూపు మంగ‌ళ‌గిరి నోయోజ‌క వ‌ర్గ‌మీదె. టీడీపీ నుంచి దాదాపు లోకేష్ పోటీ క‌న్ఫ‌మ్ అయ్యింది. వైసీపీలో చేరిన నార్నెకు పార్టీ కేంద్ర పాలకమండలి(సీజీసీ) సభ్యుడిగా నియమించారు అధినేత వైఎస్ జగన్. అయితే ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే నార్నె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి.

పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే మంగళగిరి నుంచి నారా లోకేష్ పై పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబును తాను దగ్గర నుంచి చూశానని…. చంద్రబాబుకు, జగన్ కు మధ్య చాలా తేడా ఉందని అన్నారు. ప్రజల కోసం వైఎస్ ఎంతో చేశారు కాబట్టే తాను జగన్‌కు మద్దతిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌‌ను చంద్రబాబు డెవలప్‌ చేయలేదని అన్నారు. ఎంతో మంది సీఎంలు అభివృద్ధి చేశార‌న్నారు.తన నిర్ణయంతో ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని.. ఈ అంశాన్ని ఆయనతో ముడిపెట్టొద్దని కోరారు. పదేళ్లగా వైఎస్ కుటుంబంతో తాను సన్నిహితంగా ఉన్నానని చెప్పారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నానని నార్నె వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -