వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్రస్టేషన్ మాట్లాడుతున్నారు.. మనం ఇటీవల జయహో బీసీ సభను విజయవంతం చేశాం.. అది చూసి జగన్కు ఏం చేయాలో తెలియక .. పోటీగా ఏలూరులో బీసీ గర్జన సభ పెట్టారు.. వీ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయనంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడే బీసీ సామాజిక వర్గ ప్రజల స్థితిగతులపై జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఓ అధ్యయన కమిటీ వేశారు. ఆ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి వారి సమస్యలను తెలుసుకొని, దానికి తగ్గ పరిష్కార మార్గాలు సూచిస్తుందని వీటన్నంటిని క్రోడికరించి పాదయాత్ర ముగిసిన తర్వాత ఓ సభ ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని జగన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు.
తాము టీడీపీని ఫాలో అవ్వడం లేదని.. మేము సభ ఏర్పాటు చేస్తామని తెలిసే మీరే ముందు సభ పెట్టుకున్నారంటూ కౌంటర్ వేస్తున్నారు. ఇక జగన్కు ఫ్రస్టేషన్ వచ్చేస్తుందన్న చంద్రబాబు వ్యాఖ్యలు చాలా ఫన్నీగా ఉన్నాయంటున్నారు నేతలు. ఏపీలో వీస్తున్నఫ్యాన్ గాలి ప్రభావానికి టీడీపీ నేతలకే ఫ్రస్టేషన్ పీక్స్లో ఉందని.. అందుకే ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు. ఆయన ఇలా అన్నాడో లేదో.. అన్ని మీడియా ఛానల్లలో వాటినే ప్రముఖంగా చూపిస్తూ ఆనందిస్తున్నారన్నారు. నవరత్నాల పథకాల నుంచి హోదా పోరాటం వరకు జగన్ను చంద్రబాబే ఫాలో అవుతున్నారంటూ చురకలు అంటిస్తున్నారు.
- Advertisement -
ఫ్రస్టేషన్ అంటూ ఫన్నీగా మాట్లాడుతున్న బాబు
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -