Monday, May 13, 2024
- Advertisement -

క‌ట్ట‌లు తెంచుకున్న రోజా ఆవేశం….

- Advertisement -

వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజా మ‌రో సారి త‌న నోటికి ప‌నిచెప్పారు. చంద్ర‌బాబు ఆయ‌న బ్యాచ్‌పై త‌న వాగ్దాటి మాట‌ల‌తో నిప్పులు చెరిగారు. నంద్యాల ఉప ఎన్నికలకు వంఛనకు, ఆత్మగౌరవానికి మధ్య పోరు అన్నారు. రాయలసీమను చంద్రబాబు భ్రష్టు పట్టించారన్నారు. తనకు వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న ప్రచారంపై ఎమ్మెల్యే రోజా స్పందించారు.

గ‌త రెండు రోజులుగా సోషల్ మీడియాలో రోజా కారు ప్రమాదంలో చనిపోయిందంటూ టీడీపీ వర్గీయులు చేస్తున్న ప్రచారంపై ఆమె మండిపడ్డారు. రోజా చచ్చిపోయిందని ప్రచారం చేస్తున్న వారి కంటే వేస్ట్‌ వెధవలు ఎవరైనా ఉంటారా అని ప్రశ్నించారు. టీడీపీ వారంతా ఎంత ఉన్మాదులుగా మారారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఉన్మాది చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ వారంతా ఉన్మాదుల్లా మారారని రోజా విమర్శించారు.

చంద్రబాబు చేసిన తప్పులను నిలదీస్తే అంత కోపం ఎందుకని ప్రశ్నించారు. తాను తొలి నుంచి కూడా భూమా అఖిలప్రియ పట్ల సానుభూతితోనే ఉంటూ వచ్చానన్నారు. కానీ తాను ప్రచారానికి వెళ్లిన సమయంలో అల్లరి చేయించేందుకు ఒక దళిత మహిళను, ఒక ముస్లిం మహిళను అఖిలప్రియ పంపించిందని అందుకే తాను కూడా నోరు విప్పాల్సి వచ్చిందన్నారు. అసలు భూమా అఖిలప్రియకు ఉన్న అర్హతలు ఏంటని ప్రశ్నించారు. బికినీ ఫెస్టివల్స్‌ నిర్వహించేందుకు సిద్ధమైతే చూస్తూ కూర్చున్న టీడీపీ మహిళా నేతలకు తనను విమర్శించే అర్హత ఎక్కడుందని రోజా ప్రశ్నించారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఐదుసార్లు ఓడిపోయినా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఆయన రెండు నెలలుగా నంద్యాలలో కూర్చొని సొల్లు మాట్లాడుతున్నారన్నారు. బాధ్యతలేని వ్యవసాయ మంత్రి సోమిరెడ్డి అన్నారు. రాజకీయం కోసం సొంత వదినకు నష్టం చేశావన్నారు. నీ బతుకెంటో, నీ తమ్ముడి బతుకెంటో తుని వెళ్తే తెలుస్తుందని యనమల రామకృష్ణుడిని ఉద్దేశించి అన్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -