Saturday, May 18, 2024
- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారా?

- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యేలు అంద‌రు రాజీనామాల‌కు సిద్దం అయ్యారా? అంటే అవున‌నే అంటున్న‌యి రాజ‌కీయ వ‌ర్గాలు. క‌డ‌ప జిల్లాలో ఏర్పాటు చేస్తాన‌న్న ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క‌డుగు వేయడంతో దీనికి నిర‌స‌న‌గా వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్న‌ట్లు స‌మాచారం. వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆదేశాల మేరకే ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇక ఇప్ప‌టికే ఉక్కు ఫ్యాక్టరీ కోసం టీడీపీ ఎంపి సియం ర‌మేష్ దీక్ష చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌డ‌ప జ‌గ‌న్ సొంత జిల్లా కావ‌డం,ఇక్క‌డ ఫ్యాక్టరీ కోసం జ‌గ‌న్ ఒక్క మాట కూడా మాట్లాడ‌క‌పోవ‌డంపై టీడీపీ నేత‌లు జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ విష‌యంలో టీడీపీ దీక్ష చేయ‌డంతో క‌డ‌ప‌లో కాస్తా సానుభుతి సంపాదించింది. ఈ విష‌యంలో వైసీపీ కాస్తా వెన‌క ప‌డింద‌నే చెప్పాలి.

దీంతో పాద‌యాత్ర‌లో ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్ అల‌ర్ట్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి,ఆ మైలేజ్‌ని త‌న ఖాత‌లోకి వేసుకోవ‌ల‌ని జ‌గ‌న్ భావిస్తున్నాడు. దీంతో క‌డ‌ప జిల్లా ఎమ్మెల్యేతోనే కాకుండా మొత్తం పార్టీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాల‌ని జ‌గ‌న్ ఆలోచ‌న‌. జ‌గ‌న్ ప్లాన్‌తో టీడీపీ పార్టీని కార్న‌ర్ చేసిన‌ట్లు ఉంటుంద‌ని,వారిని కూడా రాజీనామా చేయ‌మ‌ని డిమాండ్ చేయ‌వ‌చ్చ‌ని వైసీపీ నాయ‌కులు ఆలోచ‌న‌. వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాల గురించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -