Saturday, May 18, 2024
- Advertisement -

చంద్ర‌బాబుపై విజ‌య‌సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు..

- Advertisement -

అంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయం ర‌క్తిక‌ట్టింది. నిన్న‌టి వ‌ర‌కు వైసీపీ ప్ర‌వేశ‌పెట్టే అవిశ్వాస‌తీర్మానానికి మ‌ద్దుతు ప్ర‌క‌టించిన బాబు అనూహ్యంగా యూట‌ర్న్ తీసుకున్న సంగ‌తి తెల‌సిందే. వైసీపీకి మైలేజీని త‌గ్గించ‌డానికి మోదీ ప్ర‌భుత్వంపై సొంతంగా టీడీపీ అవిశ్వాస తీర్నానం పెట్టింది. బాబు ఆడుతున్న నాట‌కాల‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయి కీల‌క వ్యాఖ్య‌లుచేశారు.

చంద్రబాబునాయుడు తన రెండు నాలుకల ధోరణిలో ప్రజాకోర్టులో మరోసారి అడ్డంగా బుక్కయ్యారని విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. తొలుత మేము పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని చెప్పిన ఆయన, ఆపై మాట తప్పి తన నైజమే అంతని నిరూపించుకున్నారని విమర్శించారు.

చంద్రబాబు గతంలో ఎన్నోమార్లు యూ టర్న్ తీసుకున్నారని, ఇప్పుడు తీసుకున్న యూ టర్న్ ఆయన్ను రాష్ట్ర ద్రోహిగా మారుస్తుందని హెచ్చరించారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఎంతమాత్రమూ లేదని విజయసాయి ఆరోపించారు. తమ అవిశ్వాస తీర్మానానికి బీజేపీ, టీడీపీ మినహా అన్ని పార్టీలూ మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -