Friday, May 17, 2024
- Advertisement -

సీఎం ర‌మేష్ పెద్ద దొంగ‌…సుజ‌నా ఆర్థిక నేర‌గాడు…

- Advertisement -

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబు, ఆపార్టీ ఎంపీల‌పై నిప్పులు చెరిగారు. రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మొక్కారనే వార్తలు చర్చనీయంశంగా మారాయి. ప్రధానితో భేటీ అంశాంలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అని, చర్చల కోసం దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చినా తాము సిద్ధమేనని స్పష్టం చేశారు.

తనకు బద్ధ శత్రువైన చంద్రబాబు ఎదుటపడినా… ఆయనకు తాను నమస్కారం పెడతానని చెప్పారు. తన కంటే ముందు టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మోదీ వద్దకు వెళ్లి నమస్కారం పెట్టారని… ఇందులో తప్పు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సుజనా చౌదరి తర్వాత తాను నమస్కారం పెట్టానని చెప్పారు.

వ్యవస్థలన్నింటిని మేనేజ్ చేసి 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఓటుకు నోటు కేసులో కూడా ఎలా మేనేజ్ చేసుకున్నది అందరికీ తెలుసన్నారు. చంద్రబాబుకు నిజంగా మనస్సాక్షి ఉంటే చంద్రబాబు న్యాయస్థానాల ముందు నిలబడాలన్నారు.

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో చాలా మంది నేరగాళ్లేనని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. వందల మందిని హత్యలు చేయించిన పరిటాల రవి టీడీపీ వ్యక్తి కాదా అని ప్రశ్నించారు. రెండు సంవ‌త్సాలు జైలు శిక్ష‌ప‌డిన చింత‌మ‌నేని మీపార్టీవాడేన‌ని అన్నారు.

ప్రజా సమస్యల గురంచి ప్రధానిని కలిస్తే నన్ను విమర్శిస్తున్న టీడీపీ నేతలు.. ఇవాళ రాజ్యసభలో జరిగినదానికి ఏం సమాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. ఒకవైపు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇంకోవైపు ప్రధాని మోదీతో, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో వీళ్లు ఏం మంతనాలు చేస్తున్నారు? ఏకంగా జైట్లీ కాళ్లు మొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజ్యసభ సీసీటీవీ ఫుటేజీల్లో టీడీపీ ఎంపీల బాగోతమంతా రికార్డైంది. ఆ ఫుటేజీని సర్టిఫై చేయించి, సెక్రటరీ సంతకంతో బయటపెడితే టీడీపీ గుట్టు రట్టవుతుంది’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -