Monday, April 29, 2024
- Advertisement -

నిత్య‘కళ్యాణం’ గారు.. పవన్ పై విజయసాయి సెటైర్లు

- Advertisement -

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఆయన గాలి తీసేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్విట్టర్ లో స్పందించిన విజయారెడ్డి.. జనసేనాని పవన్ ను, టీడీపీ అధినేత చంద్రబాబును ఉతికి ఆరేశారు.

విజయసాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేశారు. ‘జనసేన పార్టీ కార్యకర్తలకు మీరిచ్చే సందేశం ఇదేనా నిత్యకళ్యాణం గారూ.. మూడు పెళ్లిళ్లు చేసుకుంటే తప్పేమిటి? ఇష్టమైతే ఎవరైనా ఎన్ని కళ్యాణాలైనా చేసుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ప్యాకేజీ స్టార్లు, వివాహ వ్యవస్థ అంటే గౌరవం లేని వారు ప్రజా నాయకులు ఎప్పటికీ కాలేరు.. అతిగా ఊహించుకోకండి’ అంటూ పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ సాక్షిగా విజయసాయిరెడ్డి కడిగిపారేశారు.

ఇక మరో ట్వీట్ లో చంద్రబాబును కూడా వదిలిపెట్టలేదు విజయసాయిరెడ్డి.. ‘చంద్రబాబు కొడుకు నారా లోకేష్ నాలుగు గంటలు అల్పాహారం మానేసి అదే దీక్ష అన్నాడు. ఇప్పుడు తండ్రి ఉదయం నుంచి సాయంత్రం దాకా వ్రతం చేస్తారట.. నిరాహార దీక్ష అనే మాటలను తండ్రీకొడుకులు అపహాస్యం చేస్తున్నారు. కనీసం ఒక్క రోజైనా భోజనానికి దూరంగా ఉండలేని వాళ్లు ప్రచారం కోసం దీక్షల పేర్లు ఉపయోగిస్తున్నారు’ అని చంద్రబాబు-లోకేష్ ల గాలి తీసేశారు విజయసాయి రెడ్డి.

ఇలా పవన్ కళ్యాణ్ తోపాటు, చంద్రబాబు, లోకేష్ లను ట్విట్టర్ లో ఎండగట్టారు విజయసాయి రెడ్డి. వారు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపై కౌంటర్లు సంధించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -