వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ ఒక్కడిని పక్కన పెడితే చంద్రబాబుతో సహా ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కునే నాయకుడు ఇంకొకరు ఎవరూ కనిపించరు. అయితే విజయసాయి మాత్రం ఆ పరిస్థితిని మార్చేశాడు. రాజకీయాలతో అంతకుముందు వరకూ టచ్లో లేకపోయినప్పటికీ చాలా తక్కువ కాలంలోనే వ్యూహరచన చేయడంలో ఆరితేరిపోయాడు విజయసాయి. రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని పచ్చ బ్యాచ్ అందరికంటే ముందుగానే కనుక్కుని బాబు బ్యాచ్ అందరికీ షాక్ ఇచ్చాడు.
ఇక చంద్రబాబు అవినీతి వ్యవహారాల గురించి ఎప్పటికప్పుడు బయటపెడుతూ ఉన్నాడు. రీసెంట్గా తిరుమల వెంకన్న నగలు స్వయంగా చంద్రబాబు ఇంట్లో ఉన్నాయని……. బాబు ఇంట్లో సెర్చ్ చేశాక నగలు దొరక్కపోతే ఎంపి పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరాడు విజయసాయి. ఇక గంటా వర్గం మొత్తం తమకు టచ్లో ఉందని కూడా బాబును హెచ్చరించాడు విజయసాయి. అయితే చంద్రబాబు మాత్రం మహానాడు వేదికగా విజయసాయి మాటలపై స్పందించే ధైర్యం చేయలేకపోయాడు. నారాలోకేష్ అవినీతి వ్యవహారాలతో సహా చంద్రబాబు అవినీతి, అక్రమ వ్యవహారాలపై తాజాగా కూడా బాబు అండ్ కోకు ఛాలెంజులు విసిరాడు విజయసాయి. అయితే చంద్రబాబు అండ్ కో మాత్రం కనీసం స్పందించే ధైర్యం చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఈ విషయాలే మహానాడు వేదికగా టిడిపి నేతల మధ్య చర్చనీయాంశం అవుతున్నాయి. ఎ2 అని చెప్పి విజయసాయిని తామే పాపులర్ చేశామని……… ఇప్పుడు ఆ విజయసాయి విమర్శలకు, ఛాలెంజ్లకు సమాధానం చెప్పే పరిస్థితుల్లో కూడా లేకుండా పోతే ప్రజల్లోకి విజయసాయి చెప్పింది నిజమే అన్న సంకేతాలు వెళతాయని, అది పార్టీకి మంచిది కాదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మౌనం అర్థాంగీకారం అనే కోణంలో బాబు వ్యవహారాలను ప్రజలు తీసుకుంటే 2019 ఎన్నికల్లో మొత్తానికే పుట్టిమునగడం ఖాయం అన్న భయాలు టిడిపి నేతల మాటల్లో కనిపిస్తున్నాయి.