Thursday, May 16, 2024
- Advertisement -

రాష్ట్రపతి, ప్రధాని విజయసాయిరెడ్డికి ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యత వెనుక మర్మం ఏంటి?

- Advertisement -

తదుపరి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరో దేశంలో ఉన్న మహా మహా నాయకులకు, బిజెపి ముఖ్యనాయకులకు, మీడియా పెద్దలకు కూడా తెలియని టైంలో జగన్‌కి అత్యంత సన్నిహితుడు, వైకాపా ఎంపి విజయసాయిరెడ్డి మాత్రం రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్‌ని కలిసి అభినందించాడు. ఆ ఫొటోలు అప్పట్లో మీడియాకు ఇస్తే మన మీడియా వాళ్ళు అస్సలు పట్టించుకోలేదు. రామ్ నాథ్ కోవింద్‌ని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాక మాత్రం మీడియా మొఘల్స్ కూడా షాక్ అయ్యారు. బిజెపి ప్రముఖులకు కూడా తెలియని విషయం విజయసాయికి ఎలా తెలిసింది అని మీడియా పెద్దలు, రాజకీయ మేధావులు ఆశ్ఛర్యపోయారు.

ఇక ఇప్పుడు కూడా అలాంటి మరోషాక్ ఇచ్చాడు విజయసాయి. సంవత్సరాలుగా మోడీ అపాయింట్‌మెంట్ కోసం చంద్రబాబు పడిగాపులు కాస్తున్న విషయం తెలిసిందే. కనీసం గుజరాత్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళాలి అని బాబు అనుకుంటే కూడా బిజెపి మాత్రం ఆహ్వానించకుండా అవమానించింది. ఎన్డీయే ముఖ్యమంత్రులందరికీ ఆహ్వానాలు అందిన, హాజరైన ఆ కార్యక్రమానికి చంద్రబాబుకు మాత్రం ఇన్విటేషన్ కూడా లేకుండా పోయింది. అలాంటి నేపథ్యంలో మోడీతో ప్రత్యేకంగా భేటీ అయి షాక్ ఇచ్చాడు విజయసాయిరెడ్డి. సుజనాచౌదరితో సహా చాలా మంది ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం చూస్తున్నారు. చంద్రబాబు గురించి అయితే చెప్పనవసరం లేదు. మరి విజయసాయికి మాత్రం అపాయింట్‌మెంట్ వెంటనే ఎందుకు దొరుకుతోంది. మోడీని కలిసినప్పుడల్లా విజయసాయి ఏం చర్చిస్తున్నాడు? ఏం మంతనాలు చేస్తున్నాడు అన్న విషయాలే ఇప్పుడు బాబు అండ్ టీంకు నిద్రపట్టుకుండా చేస్తున్నాయి. వైకాపాలోనూ, సాక్షి మీడియాలోనూ జగన్‌కి హెల్ప్ అవుతున్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు అన్నది నిజం. అందరూ కూడా జగన్ కష్టంతో అధికారం వస్తే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నవాళ్ళే. కానీ ఒక్క విజయసాయిరెడ్డి మాత్రం జగన్‌కి కొండంత బలంగా నిలుస్తూ బాబు అండ్ టీంకి షాకుల మీద షాకులు ఇస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -