ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పోరాటం చేస్తోన్న వైఎస్సార్సీపీ.. చివరి అస్త్రమైన రాజీనామాలపై ముందడుగువేసింది. కేంద్రప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసిపి ఎంపిలు రాజీనామలు చేస్తున్నారు. కేంద్రంపై తమ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేపట్టనందుకు నిరసనగా ఎంపిలు రాజీనామాలు చేయనున్నారు. తమ రాజీనామా లేఖలను సిద్ధం చేసుకున్నారు. కొద్దిసేపట్లో స్పీకర్ సుమిత్రా మహాజన్ కు కలిసి లేఖలను అందచేయాలని నిర్ణయించారు.
బుధవారం గనుక లోక్ సభ జరగకపోతే సమావేశాలను నివదికంగా వాయిదా వేసేందుకే అవకాశాలున్నాయి. ఆ విషయాన్ని స్పీకర్ ప్రకటించగానే రాజీనామాలు ఇచ్చేయాలని అందరు ఎంపిలు నిర్ణయించారు
పార్లమెంట్ నిరవధికంగా వాయిదాపడ్డ మరుక్షణమే రాజీనామాలు చేస్తామన్నా ఆ పార్టీ ఎంపీలు బుధవారం రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్రెడ్డి, మిథున్రెడ్డి.. సంతకాలు చేసిన రాజీనామా లేఖలతో లోక్సభకు బయలుదేరారు.