Friday, May 17, 2024
- Advertisement -

పార్ల‌మెంట్‌లో క‌ల‌క‌లం… వైసీపీ ఎంపీల‌పైకి దూసుకెల్లిన జేసీ దివాక‌ర్‌రెడ్డి

- Advertisement -

ఏపీకీ ప్ర‌త్యేక‌హోదాపై ఎంపీల నినాదాల‌తో పార్ల‌మెంట్ అట్టుడుకుతోంది. ఒక వైపు వైసీపీ ఎంపీలు, మ‌రో వైపు టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తున్నారు. అయితే టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి మ‌రో సారి త‌న దురుసు బ‌య‌ట‌ప పెట్టాడు. ఉదయం పార్లమెంట్ ఆవరణలో ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు పట్టుకుని వైసీపీ ఎంపీలు నిర‌స‌న‌లు తెలుపుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే నిరసనలు తెలియజేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పైకి టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దూసుకెళ్లడంతో కొంత కలకలం రేగింది. పార్లమెంట్ గేట్ ముందు నిలబడి ఉన్న వైసీపీ ఎంపీల ముందుకు వెళ్లిన జేసి, వారితో తీవ్ర వాగ్వాదానికి దిగి, దమ్ముంటే వెంటనే వైకాపా ఎంపీలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అక్కడున్న వైకాపా ఎంపీలు మీకు ఆ దమ్ము లేదా? అని ప్రశ్నించడంతో, జేసీ తీవ్ర ఆగ్రహంతో వారిపైకి వెళ్లి, వాళ్లను అక్కడి నుంచి లాగే ప్రయత్నం చేశారు. తనమీసం మెలేస్తూ, మూతి మీద మీసం ఉంటే ఇప్పుడే రాజీనామాలకు కదలాలని డిమాండ్ చేశారు.

ఎంపీ జేసీ చేసిన స‌వాల్‌ను స్వీక‌రిస్తున్నామ‌ని ఆపై వైకాపా ఎంపీలు వెల్ల‌డించారు. అందరూ కలసి కట్టుగా నేడే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేద్దామంటే తాము అంగీకరిస్తామని స్పష్టం చేయడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -