నంద్యాల ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని టీడీపీ చేస్తున్న ప్రలోభాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెల్లారు వైసీపీ నేతలు.పార్టీ ఎంపీలు సోమవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకే జోతిని కలిశారు.నంద్యాల ఉప ఎన్నిక సందుర్భంగా ఏకంగా చంద్రబాబు నాయుడే ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేశారు.
ఉప ఎన్నిక సందర్భంగా నంద్యాలలో అధికార పార్టీనేతలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.ఓటర్లను బెదిరించిన సంఘటను చోటు చేసుకున్నాయి.టీడీపీకి ఓటు వేయకుంటే రోడ్డుపై ఎలా తిరుగుతారు, పార్టీకి ఓటు వేయకుంటే అభివృద్ధి పనులు ఆపివేస్తామని బెదిరిస్తున్నారని, అలాగే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.50 లక్షలు ఇస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పట్టుబడ్డారని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, టీడీపీ గుర్తింపును రద్దు చేయాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఈ సందర్భంగా ఏకే జోతికి వినతిపత్రం సమర్పించారు.
అధికార పార్టీ ఓటర్లను ప్రలోభపెడుతోందని ఆ పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. సుమారు పదిమంది మంత్రులు అక్కడే మకాం వేసి అరాచకాలు చేస్తున్నారన్నారు. అలాగే పలువురు అధికారులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. అలాగే నంద్యాలలో ఎన్నికలు పాదర్శకంగా జరిగేలా కేంద్ర బలగాలను పంపించాలని సీఈసీని కోరినట్లు ఆయన తెలిపారు.
- Advertisement -
నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారు….
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -