నంద్యాల ఉప ఎన్నిక దగ్గర పడటంతో పార్టీలకు ట్విస్ట్లమీద ట్విస్ట్లు తగులుతున్నాయి. ఇరు పార్టీలు ప్రధానంగా పార్టీ మారె నేతలపై దృష్టి సారించారు. వైసీపీ టీడీపీ నేతలను పార్టీలోకి చేర్చుకుంటుంటె…అటు టీడీపీ కూడా వైసీపీ అసంతృప్త నేతల మీద దృష్టిసారించింది. ఇప్పుడు తాజాగా వైసీపీకి మరో షాక్ ఇవ్వనుంది టీడీపీ.
శిల్పా చక్రపాణిరెడ్డిని చేర్చుకుంటున్న వైసీపీకి ఆ పార్టీ బనగానపల్లి ఇన్ ఛార్జ్ కాటసాని రామిరెడ్డి ఝలక్ ఇవ్వబోతున్నారని సమాచారం. నంద్యాల ఉప ఎన్నికలో టికెట్ ను శిల్పా మోహన్ రెడ్డికి ఇవ్వడంతో… టికెట్ పై ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఎన్నికల బరిలో వైసీపీ తరపున రాజగోపాల్ రెడ్డి ఉంటారని గతంలో కాటసాని ప్రకటించారు. అయితే, టీడీపీని వీడి వైసీపీలో చేరిన శిల్పాకు టికెట్ ఇవ్వడంతో ఆయన షాక్ అయ్యారు
ఏకగ్రీవంకోసం ప్రయత్నించి కాటసానికి జగన్ క్లాస్ పీకడంతో అసంతృప్తితో ఉన్న ఆయన ఎన్నికల ప్రచారంలో ఎక్కడా పాల్గొనలేదు. పార్టీకి చెందిన నేతలను కూడా కలవడం లేదు. ఇప్పుడు ఇది వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు తన కుమార్తె కోరిక మేరకు ఆయన తన అల్లుడైన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డికి మద్దతు తెలుపుతున్నారని సమాచారం. రేపు జగన్ నంద్యాల వెళుతున్నారు. ఈ సందర్భంగానైనా కాటసాని వస్తారా? లేదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. టీడీపీకి వైసీపీకి షాక్ ఇస్తుంటె …. టీడీపీకూడా వైసీపీకి షాక్ ఇస్తోంది.
https://www.youtube.com/watch?v=rbWEAZ9i9o8