Wednesday, May 8, 2024
- Advertisement -

మత్తేక్కించి బాలికపై రేప్ చేసిన గ్యాంగ్

- Advertisement -

14 ఏళ్ల బాలికపై ఓ ఘోరం జరిగింది. ఆ బాలిక కామాంధుల చేతుల్లో నలిగిపోయింది. ఏకంగా 40 మంది పురుషులు ఆ అమ్మాయి పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల్లోకి వేళ్తే.. ఆసియా దేశాల్లో ఒకటైన థాయ్‌లాండ్‌లోని పంగ్ ఎన్‌గా ప్రావిన్స్‌లో ఓ ఘటన జరిగింది.

బాధితురాలి తల్లిదండ్రులు కూలి కార్మికులు.. రాత్రిపూట పనులకు వెళ్ళిపోతారు. చిన్నారి మాత్రమే ఇంట్లో ఒంటరిగా వుండేది. ఆ టైంలో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే వ్యక్తి.. మరో రోజు ఆ బాలికపై అత్యాచారం పాల్పడేందుకు తన స్నేహితులను తీసుకొచ్చాడు. వారందరూ కలిసి.. బాలికకు మత్తుమందిచ్చి అత్యాచారం చేశారు. ఈ సంగతి బయటకు చెప్తే చంపేస్తామంటూ బెదిరించింది. దీంతో తల్లిదండ్రుల వద్ద ఈ విషయాన్ని బాధిత బాలిక దాచేసింది. ఇలా రోజు రోజుకి బాలికపై అత్యాచారం చేసేందుకు ఓ బృందం వచ్చి వెళ్లేది.

గత ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు ఈ ఘోరం జరిగింది. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో విచారణ జరపాల్సిందిగా సదరు రాష్ట్ర పోలీసులకు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ లైంగిక దాడిని అడ్డుకోవడానికి బాధితురాలే.. తల్లితో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -