Wednesday, April 24, 2024
- Advertisement -

దర్శకుడు మారుతీ గురించి ఎవరికి తెలియని నిజాలు..!

- Advertisement -

‘ఈరోజుల్లో’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు మారుతీ. ఆ తర్వాత బస్ స్టాప్, కొత్త జంట వంటి సినిమాలు తీసి హిట్ అదుకున్నాడు. మొదట్లో యూత్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీసిన మారుతి.. తన పంతా మార్చి కొత్త తరహాలో ’భలే భలే మగాడివో’ ’బాబు బంగారం’ ’మాహానుభావుడు’ వంటి సినిమాలు తీసి హిట్ అందుకున్నాడు.

తర్వాత శైలజా రెడ్డి అల్లుడు ప్లాప్ తర్వాత ప్రతీ రోజూ పండగే సినిమాతో హిట్ కొట్టాడు. అయితే మారుతీ దర్శకుడు కాకముందు గ్రాఫిక్స్ డిజైనర్ గా పనిచేసేవాడని చాలా మందికి తెలిసిన విషయమే. కానీ అంతకు మించిన కష్టాల్ని చూసి వచ్చానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మారుతీ. ఆయన మాట్లాడుతూ.. “అప్పట్లో నేను మా ఇంట్లో మెషిన్ కుట్టేవాడిని. నాకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చు. చిరిగిన దుస్తులన్నీ కుట్టేవాడ్ని. అంతేకాదు మా నాన్నగారితో కలిసి అరటిపళ్లు కూడా అమ్మేవాడ్ని.

అంతేకాకుండా ఒక ఆఫీస్ లో అసిస్టెంట్ గా వర్క్ చేశా. ఆఫీసులో టీలు, జిరాక్స్ కాపీలు అందించడం వంటివి చేసేవాడిని. అటు తరువాత రియల్ ఎస్టేట్ సంస్థలో కూడా పనిచేశాను. నాకు కష్టం విలువ తెలుసు” అంటూ చెప్పుకొచ్చాడు మారుతీ. ప్రస్తుతం ఈ హీరో స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. గోపీచంద్ తో ఓ సినిమా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సొంత విమనాలు ఉన్న హీరోలు వీరే..!

డాడీ, గంగోత్రి కంటే ముందే బన్నీ సినిమాలు చేశాడు.. అవేంటంటే ?

’మర్డర్’ సినిమాలో అమృతగా నటిస్తున్న ఈమె గురించి మీకు తెలుసా ?

‘కార్తీక దీపం’ వంటలక్క గురించి షాకింగ్ నిజాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -