Friday, May 3, 2024
- Advertisement -

ప్రజా సంక్షేమంలో రాజశేఖరరెడ్డి బెస్ట్….. ‘రాజకీయం’లో బాబు బెస్ట్ః రాధాకృష్ణ

- Advertisement -

‘రాజశేఖరరెడ్డి పాలనలో ప్రజల సంతృప్తి స్థాయి అత్యున్నత స్థాయిలో ఉండేది. ప్రజా సంక్షేమం విషయంలో రాజశేఖరరెడ్డినే అగ్రశ్రేణి పాలకుడు’………… ఈ మాటలు జగన్ మీడియాలో వచ్చాయని అనుకుంటున్నారా? కాదండీ బాబూ. స్వయంగా రాధాకృష్ణనే చేసిన వ్యాఖ్యలు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రజల సంతృప్తి స్థాయి చాలా గొప్పగా ఉండేది. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ప్రజల మేలు చేకూర్చాయి అని స్వయంగా రాధాకృష్ణనే తన కొత్తపలుకు కాలంలో రాసుకున్నారు. కేసీఆర్ వైఎస్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నప్పటికీ వైఎస్సార్ పాలన స్థాయిలో ప్రజల్లో సంతృప్తి కనిపంచడంలేదని కూడా రాధాకృష్ణనే చెప్పుకొచ్చాడు. ఇక చంద్రబాబు సంక్షేమ పథకాల గురించి చెప్పడానికి కూడా ఏమీ లేకనో ఏమో కానీ అస్సలు ఏమీ చెప్పలేదు.

అయితే ప్రజల సంక్షేమం విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి అగ్రతాంబూలం ఇచ్చిన రాధాకృష్ణ…….. చంద్రబాబు కూడా ఒక విషయంలో బెస్ట్ అని చెప్పాడు. ఎప్పుడు ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి…….. ఎప్పుడు ఎవరితో పొత్తు తెంచుకోవాలి………. అధికారంలోకి రావాలంటే ఏ పార్టీతో కలవాలి……. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు ది బెస్ట్ అని స్వయంగా అదే కొత్తపలుకులో చెప్పుకొచ్చాడు రాధాకృష్ణ.

షాకింగ్‌గా ఉంది కదా……….. వైఎస్ పాలనలో అవినీతి తప్ప వేరే ఏమీ లేదు అని అహర్నిశలూ బురదచల్లిన రాధాకృష్ణ…….. బాబుతో సహా టిడిపి జనాలందరూ వైఎస్ పాలన అంటేనే అవినీతి అనేలా ప్రసంగాలు చేేేసేలా స్క్రిప్ట్‌లు రాసిచ్చిన రాధాకృష్ణ……….. ఇప్పుడు ప్రజా సంక్షేమం విషయంలో వైఎస్సార్ బెస్ట్…….. అధికారం కోసం చేసే రాజకీయాల విషయంలో చంద్రబాబు బెస్ట్ అని చెప్తూ ఉంటే రాధాకృష్ణ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకోవాలో కూడా టిడిపి నేతలకు తెలియట్లేదు. సోషల్ మీడియాలో రాధాకృష్ణ వ్యాఖ్యలను పట్టుకుని వైసిపి జనాలు, తటస్థలు ఓ స్థాయిలో సెటైర్స్ వేస్తూ ఉంటే టిడిపి జనాలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. మొత్తంగా చూస్తే తెలుగు ప్రజలందరికీ తెలిసిన ఒక నిజాన్ని మాత్రం స్వయంగా రాధాకృష్ణ కూడా ఒప్పుకున్నాడన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి సాటి వచ్చే నాయకుడు లేడు. అలాగే రాజకీయాలు, అధికారం కోసం చేసే వ్యూహ రచనల విషయంలో చంద్రబాబు క్యారెక్టర్‌ని తేలగొట్టే పాత్ర పురాణాల్లో వెతికినా కూడా కనిపిందన్న నికార్సైన నిజం రాధాకృష్ణకు కూడా తెలుసు అన్న విషయం ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైంది. కాకపోతే ఎవరి వ్యక్తిగత స్వార్థాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి భజన జర్నలిస్టులుగా బాధ్యతలు నెరవేరుస్తున్నారంతే…………..ఏమంటారు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -