Tuesday, May 14, 2024
- Advertisement -

రాధాకృష్ణ అరెస్ట్ వారెంట్…… చంద్రబాబు బాటలోనే ఏం చేశాడో తెలుసా?

- Advertisement -

ప్రపంచానికి పాఠాలు చెప్పాను అని చెప్పుకునే చంద్రబాబుపైన ఉన్న కేసుల గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన భజన బృందంలో ప్రధాన సభ్యుడైన ఆంద్రజ్యోతి రాధాకృష్ణ కేసు గురించి కూడా ఎల్లో మీడియాలో తప్ప ఇతర మీడియా సంస్థల్లోనూ, సోషల్ మీడియాలోనూ ప్రముఖ వార్త అయింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ మోడీని కలిస్తే రాధాకృష్ణ మాత్రం ఎంచక్కా తనకు తోచినట్టుగా వ్యక్తిగత స్వార్థంతోనే జగన్ ప్రధానిని కలిసినట్టుగా పేజీలకు పేజీలు రాసి పడేశాడు. జగన్ అవినీతి కేసుల గురించి ప్రధానితో మాట్లాడాడు అంటూ ప్రధాని-జగన్ పరస్పర మీటింగ్‌లో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నది కూడా తనకు తెలుసన్నట్టుగా రాసిపడేశాడు. గతంలో సోనియా మీటింగ్‌లో, జేడీ విచారణ వ్యవహారాలన్నీ కూడా ఇలానే రాశాడు రాధాకృష్ణ. అయితే అప్పట్లో ఆర్కేని లైట్ తీసుకున్న జగన్ ఈ సారి మాత్రం సీరియస్ అయ్యాడు. జగన్ పార్టీ నేత రాధాకఈష్ణపై కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు విషయంలోనే రాధాకృష్ణకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్ట్.

అయితే రాధాకృష్ణ అరెస్ట్ తప్పదని అందరూ భావించిన పక్షంలో ఆర్కే మాత్రం ఎంచక్కా తన బాస్ చంద్రబాబు బాటలోనే పయనిస్తూ సుప్రీం కోర్ట్ నుంచి స్టే తెచ్చుకున్నాడు. చంద్రబాబు కూడా తనపై ఉన్న చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కేసులను ధైర్యంగా ఎదుర్కోవడం అనేది బాబు హిస్టరీలోనే లేదు అని న్యాయనిపుణులు కూడా చెప్తూ ఉంటారు. ఇఫ్పుడు రాధాకృష్ణ కూడా చంద్రబాబు స్టైల్‌లోనే స్టే తెచ్చుకున్నాడు. ఈ విషయంపై సోషల్ మీడియాలో కూడా రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాబుకు సంబంధించిన వాళ్ళే రాధాకృష్ణ కోసం కూడా సేం పాలసీ ఫాలో అయ్యి స్టే తెచ్చి ఉంటారని అంటున్నారు. ఆ రకంగా తన భజనలో మురిసిపోతున్న రాధాకృష్ణకు బాబు న్యాయం చేశాడని చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -