Tuesday, May 7, 2024
- Advertisement -

సీమాంధ్రులకు కులపిచ్చి——— ఆర్కే చెత్త పలుకు

- Advertisement -

‘ఎన్ని వేల సార్లు……… పదే పదే అదే మాట…….. ఆంధ్రులంతా కులపిచ్చిగాళ్ళే……….. తెలంగాణా ప్రజలు మాత్రం పుణ్యాత్ములు……… అస్సలు కులం గురించే ఆలోచించరు……..ఆంధ్రులు మాత్రం కులగజ్జితో కొట్టుకు చస్తూ ఉంటారు………’ తెలంగాణా జర్నలిస్ట్ రాధాకృష్ణ నోటి వెంట పదే పదే వచ్చే మాటలు ఇవే. ఇవే మాటలు వేరే ఎవ్వరు మాట్లాడి ఉన్నా ఈ పాటికి తెలుగు దేశం నేతలందరూ కూడా రెచ్చిపోయేవాళ్ళు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని హాహాకారాలు చేసేవాళ్ళు. అయితే తెలుగు దేశం పార్టీ భజన జర్నలిస్ట్ అన్న ఉద్ధేశ్యమో, లేకపోతే సొంత కులం వాడే కదా అన్న అభిప్రాయంతోనో ఏమోగానీ రాధాకృష్ణ ఎన్ని విమర్శలు చేసినా, ఒక రకంగా బూతులు తిట్టినట్టు ఉన్నా కూడా ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన్నట్టుగా అనిపించదు చంద్రబాబు అండ్ బ్యాచ్‌కి. రాజకీయ ప్రత్యర్థులపై విషం చిమ్మడానికి మాత్రం ఆంధ్రుల ఆత్మగౌరవం అంటూ రంకెలేస్తారు.

పొట్టగోస్తే అక్షరం ముక్క రాని జనాలు, కులం కోసం కొట్టుకుచచ్చేజనాలు, కులపిచ్చతో అనుక్షణం ఆలోచించేవాళ్ళు, అణువణువూ స్వార్థాన్ని నింపుకున్న జనాలు……….ఇలా సీమాంధ్రుల గురించి తెలంగాణా జర్నలిస్ట్ అయిన రాధాకృష్ణ ఎన్నెన్ని మాటలు అన్నాడో, అంటున్నాడో చెప్పనవసరం లేదు. విభజన సమయంలో కూడా పూర్తిగా ప్రత్యేక తెలంగాణాకు వత్తాసు పలుకుతూ సీమాంధ్రులను ఎద్దేవా చేశాడు, ఎటకారం చేశాడు. ప్రత్యేక హోదా అడిగిన వాళ్ళను గొర్రె జనాలుగా పేర్కొంటూ ఆ మధ్య కొత్తపలుకులు పలికాడు. ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించిన రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలని 80శాతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారని రాసేశాడు.

ఈయన రాతలను ఫాలో అవుతున్నవాళ్ళకు ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ పైన రాధాకృష్ణకు ఎంత ద్వేషం, చులకనభావం ఉందో ఇట్టే అర్థమవుతుంది. అలాంటి జర్నలిస్ట్‌ని పెంచి పోషిస్తున్న టిడిపి జనాలకు అసలు సీమాంధ్రుల ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత ఉందా? ప్రత్యర్థి పార్టీలను నాశనం చేయడానికే సీమాంధ్ర ఆత్మగౌరవం అని హాహాకారాలు చేస్తాం…………. తమ భజన చేసేవాడు సీమాంధ్రులను ఎంతలా అవమానించినా సరే…….. సీమాంధ్రులు మౌనంగా భరించాల్సిందే అన్న పాలసీని ఫాలో అవుతున్న చంద్రబాబుకు అసలు ఆంధ్రుల ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత ఉందా అన్న విశ్లేషకుల ప్రశ్నలకు టిడిపి నాయకుల దగ్గర సమాధానాలు ఉన్నాయా? టిడిపి నాయకులు ఏమో కానీ సీమాంధ్రులు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారని, తెలుగుదేశం నాయకులతో పాటు, గర్వంతో విర్రవీగుతున్న ఆ పార్టీ భజన మీడియా జనాలకు కూడా దిమ్మతిరిగేలా ఓటుతోనే సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నారని విశ్లేషకులు చెప్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -