Thursday, May 9, 2024
- Advertisement -

బియ్యపు గింజలతో కోటీ శ్వరులవ్వడం ఎలా..

- Advertisement -

అందరూ తమ జీవితం ఎంతో సౌకర్యవంతంగా ఉండాలని హ్యాపీగా సాగాలని అనుకుంటారు. దీనికి కావాల్సిన పనులు ఆన్నీ చేస్తూ ఉంటారు. కాని జీవితం అన్నాక ఒడిదుడుకులు తప్పవు. ఏదో పరంగా కష్ట సుఖాలను అనుభవిస్తూ ఉంటాం. సుఖాలు ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉంటాం. ఎందుకంటే, ఆ సమయంలో మనదగ్గర డబ్బుతో పాటు బెల్లం చుట్టూ చీమల్లా అనేకమంది జనం అయినవాళ్ళు కూడా ఉంటారు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మనకు అసలు విషయం తెలుస్తుంది. మనకి ఎప్పటినుంచో తెలిసిన వారిలో కూడా ఎన్నో కొత్త కోణాలు కనబడతాయి.

అయితే మనకు మంచి జరగాలంటే మాత్రం బియ్యంతో కొన్ని సొల్యూషన్స్ చేయచ్చంటారు మహా మహా పండితులు.. జ్యోతిష్యంలో వీటిని ఉపయోగిస్తారు. అక్షింత అంటే అఖండమైనది, శుభకార్యాలలో ఏది వెలిగేది ఉపయోగించకుడదు. అందుకే మునులు అందరు కలిసి బియ్యాన్ని అంటే అక్షింతల ను ఎన్నుకున్నారు. దేవునికి అక్షింతలు ఎంత ఇష్టం అంటే నాలుగు గింజలకే ప్రసన్నమైపోతారట. ఏదో ఒక సుముహుర్తాన ఒక ఎర్ర రంగు వస్త్రం లో ఇరవై ఒక్క బియ్యం గింజలు తీసుకొని వాటికి పసుపు కలిపి ఆ బియ్యాన్ని ఆ వస్త్రం లో కట్టి దానిని లక్ష్మి దేవి ముందు ఉంచి, ఆ తర్వాత భక్తిశ్రద్ధలతో పూజ చేసి మీ బీరువాలో పెట్టండి మీరు అనుకున్నంత ధన లాభం మీకు కలుగుతుంది.

చాలా మంది ఇలా చేసి లాభం చేకురినట్లు జ్యోతిష్యం చెబుతుంది. శివునికి సోమవారం పూజ చేసేటప్పుడు ఒక కేజీ బియ్యం దగ్గర పెట్టుకొని పూజ అయిపోయాక శివలింగం పైన ఒక గుప్పెడు బియ్యాన్ని వేసి మిగిలిన బియ్యాన్ని ఎవరైనా పేద వారికి ఇవ్వాలి. ఇలా చేయడం వలన కష్టాలు అన్నీ గట్టెక్కుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -