తన భార్య ఒకేసారి ఇద్దరు వేరే వ్యక్తులతో ఉండగా ఆమె భర్త చూశాడు. పెద్ద గోల గోల చేశాడు. అంతే పట్టరాని కోపంతో ఆమె తన ఇద్దరు ప్రియుళ్లలో కలిసి తన భర్త నాలుక కోసేసింది. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో ఈ సంఘటన జరిగింది. అసలు విషయంలోకి వెళ్తే… సంబల్ పట్టణానికి చెందిన జితేంద్ర అనే యువకుడు కొద్ది రోజుల కిందట తన భార్య మీనాక్షితో కలిసి మొరాదాబాద్ కు వలస వచ్చాడు.
ఇటుకబట్టీల్లో కూలీగా పనిచేసే అతను.. ఓ ఇంట్లో అద్దెకుంటున్నాడు. ఆదివారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చిన జితేంద్రకు తన ఇంటి బెడ్రూంలో దృశ్యం చూసి షాక్ అయ్యాడు. తన భార్య మీనాక్షి ఇద్దరు మగాళ్లతో అసభ్యకర రీతిలో ఉంది. దీంతో జితేంద్ర వారిపై దాడికి యత్నించాడు. అంతలోపే మీనాక్షి, అతని ప్రియులు కలిసి జితేంద్రను బంధించారు. పదునైన చాకుతో మీనాక్షి తన భర్త నాలుకను కోసేసింది. తర్వాత ముగ్గురూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. తర్వాత రక్తం మడుగులో ఉన్న జితేంద్రను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
అయితే.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. మీనాక్షికి పెళ్లికి ముందే చాలామందితో సంబంధాలున్నాయని, పెళ్లయ్యాక కూడా విచ్చలవిడిగా ప్రవర్తించేదని, సొంత ఊళ్లో పరువు కాపాడుకునేందుకే మీనాక్షిని తీసుకుని జితేంద్ర మొరాదాబాద్ వచ్చాడని, అయినా కూడా ఆమె మారలేదని బాధితుడి బంధువులు పోలీసులకు చెప్పారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Related