యువతకు తమ కలలను నెరవెర్చుకోవాలని ఆశపడుతారు. అయితే ప్రస్తుతం ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు జీవితంలో నిలదొక్కుకోవాలనే పట్టుదలతో నిండా మోసపోతున్న సంఘటనలు చాలా చూశాం.. ఇప్పుడు అలాంటి సంఘటనే మరోకటి జరిగింది. సినిమాలపై ఇష్టం ఉన్న కృష్ణవేణి అనే అమ్మాయి హీరోయిన్ కావాలని చాలా ఆశపడింది.
{loadmodule mod_custom,GA1}
అందుకోసం ఎంతగానో ప్రయత్నాలు చేసింది. ఇండస్ట్రీకి చెందిన వారితో పరిచయం పెంచుకుంటూ ఏదో విధంగా తనలో వున్న నటనను బయటకి తీసుకు వచ్చేందుకు ఒక్క చాన్స్ దొరకాలని గట్టిగా ప్రయత్నించింది. అయితే ఈమె కలను పసిగట్టిన శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి తాను డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నానంటూ ఆమెతో పరిచయం అయ్యాడు. ఆ అమ్మాయి ఏదోలా పూరీ జగన్నాథ్ కు పరిచయం చేయిస్తానని,తదుపరి సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్సు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దీంతో అతన్నే నమ్ముకుంది కృష్ణవేణి.ఇక ఆమెతో వున్నచనువును ఆసరాగా చేసుకున్న వ్యక్తి హీరోయిన్ గా అవకాశం ఇవ్వాలంటే తనతో ఓ రాత్రి గడపాలని కోరాడు. దీంతో ఏం చేయాలో అర్ధం కానీ కృష్ణవేణి.. అతడి మాటలు నమ్మి.. మోసపోయింది. అంతే ఆ రాత్రికి వాడుకున్న శ్రీనివాస్ ఆమెతో దూరమయ్యాడు. దీంతో మోసపోయానని గ్రహించిన అమ్మాయి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. అయితే.. శ్రీనివాస్ అనే వ్యక్తికి పూరీ జగన్నాథ్ తో ఎలాంటి సంబంధం లేనట్లు సమాచారం.
{loadmodule mod_custom,GA2}
కాకపోతే కృష్ణానగర్ అడ్డాగా పలువురు సినీ ప్రముఖులతో పరిచయాలు వున్నట్లు తెలుస్తుంది. కృష్ణవేణి లాంటి అమ్మాయిలు.. ప్రతి పరిశ్రమలో మోసపోతున్నారు. ఒక్క అవకాశం అంటూ.. సినిమాలపై పిచ్చితో.. వచ్చి.. పరిచయం లేని వ్యక్తులకు దగ్గర అవ్వడం.. చివరికి మోసపోవడం చేస్తున్నారు. ఇప్పటికైన..ఎవరిని పడితే వాళ్లను మోసపోవడం కన్న టాలెంట్ తో ముందుకు వెళ్తే.. అవకాశాలు ఇచ్చే వారు ఉన్నారు.
{youtube}bqBPsTsV3Ko{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related