పెద్ద నోట్ల రద్దు చేయడంతో.. నల్లకుబేరులు నిద్ర పోవడం లేదు. ఇక ఇటీవల ప్రధాని మోడీ మాట్లాడుతూ ఇది ఆరంభం మాత్రమే ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెప్పడంతో బ్లాక్ మనీ పోగు చేసిన వారికి చెమటలు పట్టేస్తున్నాయి. మరోవైపు పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ప్రజలను ఏ స్థాయికి దిగజారుస్తుందో ఈ సంఘటనే దానికి నిదర్శనం.. దేశంలో ఏటీఎంలు, బ్యాంకుల వద్ద వంద నోట్ల కోసం, అదేవిధంగా రూ. 2000 నోట్ల కోసం భారీ క్యూలలో జనాలు నిలబడడం మనకు తెలిసిన విషయమే.. ఈ రెంజ్ లో నోట్ల మార్చుకోవడానికి, కొత్త నోట్లు తీసుకోవడానికి జనాలు గంటల తరబడి క్యూలో నిలబడే ఉంటున్నారు.
అయితే ఢిల్లీలోని మయూర్ విహార్ వీధిలో ఓ ఏటీఎం దగ్గర ఓ యువతి చాలాసేపుక్యూలో నిలబడి సహనం కోల్పోయింది. ఇక నిలబడ లేక నిరసన వ్యక్తం చేస్తూ బట్టలు విప్పేసి గట్టిగా కేకలు పెట్టింది. ఈ సంఘటన చూసిన అక్కడ వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పుడు అందరి వాట్సప్లలో ఈ యువతి బట్టలు విప్పేసి రచ్చ చేసిన వైనం దర్శనమిస్తోంది. ఈమె ఇలా చేస్తుండగా స్థానికులు ఆమెను వారించి బట్టలు ధరించమని ప్రాధేయపడి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే పోలీసులు ఆ యువతిని అరెస్టు చేసి ఘాజీపూర్ పోలీసు స్టేషనుకు తీసుకువెళ్లారు. అయితే సంఘటన ఎలా జరిగిందంటే.. ఈమె ట్రాన్స్ జెండర్ అని, క్యూ మధ్యలో చొరబడేందుకు ప్రయత్నించింది. దాంతో అక్కడ ఉన్నావారంతా.. అడ్డుకోవడంతో ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితిలో ఇలా చేసిందని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు ఫైనల్గా ఆ యువతి ఏటీఎం కు వెళ్లి తన డబ్బులు డ్రా చేసుకోగలిగింది.
Related