జియో ఇస్తున్న ఆఫర్లు చూసి.. అన్ని టెలికం కంపెనీలు రకరకల ఆఫర్లతో ముందు వస్తున్నాయి. ఆ క్రమంలోనే మొన్న జియో ఫోన్ ఫ్రీ ఆఫర్.. రూ.1500 డిపాజిట్ సంచలనం అయిన విషయం తెలిసిందే. అయితే జియో ఫోన్ దీటుగా మిగిత టెలికం కంపెనీలు తమ ఆఫర్లతో రంగంలో దిగాయి. ఐడియా, వొడాఫోన్ కంపెనీలు 4G ఫీచర్స్ ఫోన్లను చౌక ధరలో వినియోగ దారులకు అందించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ కంపెనీలు వారు ప్రవేశేపెట్టే ఫోన్ జియో ఫోన్ కంటే ఎక్కువ ఫీచర్లు ఉండనున్నాయని తెలిపారు. ఈ ఫోన్ ధర కేవలం 2500 రూపాయల వరకు ఉంటుందని.. ఐడియా సెల్యులార్ ఎండీ హిమాంశు కపానియా తెలిపారు. ఈ ఫోన్ లో గూగుల్, ఫేస్బుక్, వాట్సప్ వంటి యాప్స్ కూడా ఉంటాయని తెలిపింది. వినియోగదారులకు అనుకూలంగానే ఈ ఫోన్ తీసుకున్న కస్టమర్లు అవసరమైతే వేరే టెలికాం ఆపరేటర్లకూ మారవచ్చు అని కపానియా తెలిపారు.
రిలయన్స్ జియో ఫోన్లో మాత్రం ఇలాంటి సదుపాయాలు ఉండవని.. ఈ విషయాన్ని మొబైల్ కస్టమర్లు గుర్తుంచుకోవాలని కోరారు. జియో అందించే యాప్స్ మాత్రమే వాళ్లు ఇచ్చే ఫోన్ లో ఉంటాయన్నారు. రిలయన్స్ జియో మాదిరిగా 4G ఫోన్లు ఉచితంగా అందించే ఆలోచన లేదని స్పష్టం చేసింది ఐడియా.
https://www.youtube.com/watch?v=keLhKdo8-I8