రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్.. ముఖేష్ అంబానీ. ఈయన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అందరికి తెలిసిందే. అలనే ఆయన ఫ్యామిలీ గురించి కూడా అందరికి తెలిసిందే. ఆయన భార్య నీతా అంబానీ రిలయన్స్ గ్రూప్కు చెందిన పలు వ్యాపారాలను చూసుకుంటారు. ఇప్పుడు వీరి కూతురు ఈషా అంబానీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అంబానీ ఫ్యామిలీలో ఈషా ఒక్కతే కూతురు.
దాంతో ఆమెను అంబానీ ఫ్యామిలీ చాలా గారాబంగా పెంచారు. ఈషా 1991 అక్టోబర్ 23న జన్మించింది. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన తర్వాత.. సైకాలజీ, సౌత్ ఏషియన్ స్టడీస్లో డిగ్రీ పట్టా పొందింది. ఇక ఈషాకు 17 ఏళ్లు ఉన్నప్పుడే.. ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఈమె గురించి ఆర్టికల్స్ను ప్రచురించింది. దాంతో ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఈ నెపథ్యంలో ఈషా ప్రపంచంలోనే రెండవ బిలియనీర్ అయింది. ఈమె ఆస్తి విలువ 70 మిలియన్ డాలర్లు ఉంటుంది. 2015లో ఆసియాలో ఉన్న 12 మంది బడా మహిళా వ్యాపారవేత్తల జాబితాలో ఈషాకు ప్రముఖ స్థానం లభించించింది.
ఈషా అంబానీ.. తన తండ్రి వ్యాపారల్లో.. పలు సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటుంది. తన కెరీర్ ప్రారంభంలో ఈషా న్యూయార్క్లోని మెకిన్స్ అండ్ కంపెనీలో బిజినెస్ ఎనెలిస్టిక్గా పనిచేసింది. తరువాత ఈమె రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా నియమితురాలైంది. 2015లో ఈషా రిలయన్స్ జియో సర్వీస్ను ప్రారంభించింది. ఇక ఈషా వ్యక్తిగత జీవితం సంగతికి వస్తే.. ఆమెకు కలాకండ్ స్వీట్ అంటే ఎంతో ఇష్టం. పియానో వాయించడం ఆమెకు ఇష్టం. ఏంతో ఆస్తి ఉన్నప్పటికి.. ఈషా తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.