Sunday, May 19, 2024
- Advertisement -

రిలయన్స్ జియో మరో అదిరిపోయే ఆఫర్

- Advertisement -
jio mind blowing offers

ప్రస్తుతం దేశంలో ఎవరినోట విన్న రిల‌య‌న్స్ జియో పేరే వినిపిస్తోంది. ఇండియా టెలికం రంగంలో రిలయన్స్ జియో పేరు ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. ముఖేష్ అంబానీ ఈ రిల‌య‌న్స్ జియోను నెంబర్.1 స్థానంలో నిలిపేందుకు ముఖేష్ అంబానీ గట్టిగానే ట్రై చేస్తున్నాడు.

ఇప్ప‌టికే ఎన్నో సంచ‌ల‌నాల‌కు తెర‌లేపిన ఆయ‌న బ్రాడ్‌బాండ్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. రిలయన్స్ జియో 185 రూపాయలకే డీటీహెచ్ సేవలను అందించబోతోందని గతంలో వార్తలొచ్చాయి. ఇక ఈ క్ర‌మంలోనే రిల‌య‌న్స్ మ‌రో దిమ్మ‌తిరిగి పోయే ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించేందుకు రెడీ అవుతోంది. ఈ విష‌య‌మై ఇప్ప‌టికే మీడియాకు జియో య‌జ‌మాన్యం వార్త‌లు కూడా లీక్ చేసేసింది. 500 రూపాయలకే 600జీబీ డేటాను ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఇక ఇంట‌ర్నెట్ స్పీడ్ కూడా 120ఎంబీపీఎస్ నుంచి 1జీబీ మధ్యలో ఉంటుందని ప్రకటించింది. జియో గిగాఫైబర్ స్పెషల్ ఆఫర్ ప్లాన్ పేరుతో బ్రాడ్‌బాండ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియోకేర్. నెట్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను ఉంచింది. జియో గిగాఫైబర్ బ్రాడ్‌బాండ్ వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా వెల్‌కమ్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ వెల్‌కమ్ ఆఫర్‌లో నెపథ్యంలో మూడు నెలల పాటు అపరిమిత ఇంటర్నెట్ సేవలను అందించనుంది. జియో ఇప్పుడు ఇస్తున్న దెబ్బ‌కు టెలికం కంపెనీలు మ‌రింత డీలా ప‌డ‌డం ఖాయం.

Related

  1. మరో అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన జియో
  2. అబ్బో జియో దెబ్బ!
  3. 15 నెలలు అన్నీ ఫ్రీ జియో కనీ వినీ ఎరుగని ఆఫర్
  4. జియో’ దెబ్బకు ఇతర టెలికాం షేర్లు ‘ఢమాల్’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -