Friday, May 3, 2024
- Advertisement -

మరో అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన జియో

- Advertisement -
reliance jio gave one more bumper offer

రిల‌య‌న్స్ జియో మరో అద్భుతమైన ఆఫ‌ర్ ను ప్రకటించింది. కేవలం 1000 రూపాయలకే వాయిస్, వీడియో కాలింగ్ సదుపాయంతో 4జీ స్మార్ట్‌ఫోన్‌ అందించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. కేవలం కాల్స్ కోసమే ఫోన్లను వినియోగించే గ్రామీణ, టైర్-III మార్కెట్లలోని వినియోగదారుల మనసు గెలుచుకునేందుకే ఎల్‌టీఈ (వోల్ట్) టెక్నాలజీతో ఫీచర్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెబుతున్నారు. దేశంలో వంద కోట్లకు పైగా ఉన్న మొబైల్ ఫోన్ వినియోగదారుల్లో 65 శాతం మంది ఇంకా ఫీచర్ ఫోన్లనే వినియోగిస్తున్నారు.

4జీ స్మార్ట్ ఫోన్ల ధర 3 వేల స్థాయికి దిగివచ్చినప్పటికీ… కాల్ చేయడానికి తప్ప వాటి వల్ల ఉన్న అదనపు ఉపయోగాలు సరిగా తెలియకపోవడం వల్లే స్మార్ట్ ఫోన్ అమ్మకాలు కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయి. ఇక జియోకు ఇప్ప‌టి వ‌ర‌కు 2.5 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఇక దేశంలోనే పెద్ద‌ది అయిన టెల్కో కంపెనీ ఎయిర్‌టెల్‌కి ప్రస్తుతం 26 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. దీంతో ఫీచర్ పోన్లను మాత్రమే వినియోగిస్తున్న వారిని ఆకట్టుకోవడం కీలకమని నిపుణులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో వోల్ట్ టెక్నాలజీతో రూ.1000 నుంచి రూ.1500 లోపు ధర ఉండేలా రెండు రకాల ఫీచర్ ఫోన్లను రిలయన్స్ అభివృద్ధి చేస్తోంది. వచ్చే యేడాది జనవరి నుంచి మార్చిలోగా చౌక స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇవి కూడా స్మార్ట్ ఫోన్లలానే పనిచేస్తాయనీ… ఇంటర్నెట్‌తో డాటా యాక్సిస్‌కు ఉపయోగపడడంతో పాటు, వాయిస్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఈ ఫోన్లు వ‌స్తే టెలికాం మార్కెట్లో ప్ర‌కంప‌న‌లు ఖాయ‌మ‌ని తెలుస్తోంది.

Related

  1. అబ్బో జియో దెబ్బ!
  2. 15 నెలలు అన్నీ ఫ్రీ జియో కనీ వినీ ఎరుగని ఆఫర్
  3. జియో’ దెబ్బకు ఇతర టెలికాం షేర్లు ‘ఢమాల్’
  4. అతి తక్కువ దరకే ఎయిర్‌టెల్ 10 జీబీ డేటా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -