ఈ రోజుల్లో రాజకీయాలు అంటే మాటలా..? చిన్న పదవి కోసం లక్షల్లో ఖర్చు చేయాలి. ఓడిపోతే ఆ అప్పులను తీర్చడానికి తిప్పలు పడాలి. గెలిస్తే.. ఎలా సంపాదించుకోవాలని ఆలోచించాలి. పెద్దపెద్ద కార్లల్లో తిరగాలి. ఇంకా పెద్ద లీడర్ అయ్యేందుకు ప్రయత్నం చేయాలి. ఇవే.. కదా! అందరూ లీడర్లు ఆలోచించేది.
కానీ ఒక పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికైన ఒక మహిళ మాత్రం చాలా కొత్తగా కనిపిస్తుంది. తన ఫ్యామిలీని పోషించుకోవటానికి ఏ మాత్రం సిగ్గుపడకుండా రోడ్డు పక్కన ఆకుకూరలు అమ్ముతోంది. మహబూబాబాద్ జిల్లా రేగడి తండా గ్రామ పంచాయతీకి గుగులోతు లక్ష్మీ రామచంద్రు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. తనకున్నకొద్దిపాటి భూమిలో ఆకు కూరలు పండిస్తూ.. ప్రతిరోజు ఉదయం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోనున్న మార్కెట్కు ఆ కూరలను తీసుకొచ్చి అమ్ముతోంది.
ఆమెను ఎవరైనా “మీరు పంచాయతీ ప్రెసిడెంట్ అయి కూడా ఇలా..” అని అడిగితే.. ఆమె నవ్వుతూ.. “ఊరికి పెద్ద అయితే ఏంటీ.. కష్టపడి పనిచేసుకోవటంలో తప్పా” అని తిరిగి ప్రశ్నిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే జీతం నా బండి పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోవు. వాటితో నా ఫ్యామిలీ ఎలా గడుస్తుందని అంటుంది. ఇలాంటి వ్యక్తులు నేటికి ఉన్నారంటే వారిని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు అంటున్నారు.
అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు! పెళ్లి చేసుకోను అనేసింది..! అబ్బాయి ఏం చేశాడంటే.?
అదిరిపోయిన అల్లరి నరేష్‘నాంది’ట్రైలర్