Monday, April 29, 2024
- Advertisement -

అవును వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు! కానీ చివ‌ర‌కు అమ్మాయి పెళ్లి చేసుకోను అనేసింది..! అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే.?

- Advertisement -

అవును వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు. ఒక‌రంటే ఒక‌రికి ఎంతో ప్రాణం. పెళ్లి చేసుకుందామ‌ని నిర్ణ‌యించుకున్నారు. ఏం జ‌రిగిందో తెలియ‌దు.. కొన్ని రోజుల్లోనే ఆ యువ‌తితోపాటు, ఆమె త‌ల్లి కూడా పెళ్లికి అంగీక‌రించ‌లేదు. దీంతో కోపం తెచ్చుకున్న ఆ యువ‌కుడు త‌న ప్రియురాలిని, ఆమె త‌ల్లిని దారుణంగా చంపేశాడు. ఆ త‌ర్వాత త‌ను కూడా ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో జ‌రిగింది.

దీనిపై స్థానికులు చెబుతున్న వివ‌రాల ప్ర‌కారం.. చెన్నై కొరుక్కుపేట అనంతనాయగినగర్‌కు చెందిన వెంకటమ్మ (50), వెంకటేశన్ భార్య‌భ‌ర్త‌ల‌కు కూతురు రజిత (24) ఉంది. వెంకటేశన్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగం చేస్తూ నాలుగేళ్ల ముందు చ‌నిపోయాడు.దాంతో త‌న కూతురు రజితకు కార్పొరేషన్ ఆఫీస్ లో ఉద్యోగం వ‌చ్చింది. ఆ ప్రాంతానికి చెందిన భూపాలన్ కొడుకు సతీష్‌ (32) కార్పొరేషన్‌లో కాంట్రాక్టు డ్రైవర్‌గా వ‌ర్క్ చేస్తేన్నాడు. ఈ క్రమంలో వీరి ఇద్దరి మధ్య స్నేహం ఏర్ప‌డి, అది కాస్తా.. ప్రేమ‌గా మారింది. అలా ఆరు యేండ్లుగా వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారు.

వీళ్ల‌ ప్రేమను వెంకటమ్మ ఒప్పుకోలేదు. అంత‌తో ఆగ‌కుండా అదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో రజితకు పెళ్లి చేసేందుకు నిర్ణ‌యించింది. అలాగే గ‌త‌వారం నిశ్చితార్థం కూడా జరిపించింది. ఈ విష‌యాల‌ను అన్నీ చూసిన‌ సతీష్‌ గురువారం రాత్రి వెంకటమ్మతో గొడవకు దిగాడు. ఆ త‌ర్వాత‌ వెంకటమ్మ, రజితల‌ ఒంటిపై పెట్రోల్ పోశాడు. అలాగే త‌న‌పైన కూడా పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో ముగ్గురూ సజీవ దహనమయ్యారు. దీనిపై పోలీసులు విచార‌ణ చేప‌డుతున్నారు. ప‌లువురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

టీడీపీకి షాక్‌.. రాజీనామా చేసిన‌ దంప‌తులు

సెక్స్ వర్కర్‌గా శ్వేతబసు ప్రసాద్.. !

కళ్ల కింద నల్లటి వలయాలు తొల‌గించుకోవాలా? అయితే ఇలా చేయండి..!

ఈ కొత్త యాంకర్ ను కుడా వదలని శేఖర్ మాస్టర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -