Sunday, May 5, 2024
- Advertisement -

మహిళలపై అత్యాచారాలు చేయండని రెచ్చగొడుతున్నారాః అఖిల హాట్ కామెంట్స్

- Advertisement -

అఖిల ప్రియ మరోసారి రెచ్చిపోయింది. అయితే అర్థవంతంగా మాట్లాడింది. ఆవేశంలో మాటలు దొర్లినప్పటికీ ఆ మాటల్లో ఉన్న అర్థాన్ని మాత్రం ఆలోచించాల్సిందే. అయితే అఖిల ప్రియ మాటలు చంద్రబాబు, మోడీలకు గట్టిగా తగుల్తున్నాయి. లీడర్ సినిమాలో ఒక అమాయక ఆడపిల్లకు న్యాయం చేయలేని సిఎం ఉంటే ఎంత? ఊడితే ఎంత అన్న రేంజ్‌లో అఖిలప్రియ హాట్ కామెంట్స్ పాస్ చేసింది.

మోడీతో నాలుగేళ్ళ సావాసం తర్వాత…….నాలుగేళ్ళు అన్ని విధాలుగా మోడీని సమర్థించిన తర్వాత….. మోడీకోసం హోదా వేస్ట్ అని కూడా సీమాంధ్రులను నిండా ముంచిన తర్వాత చంద్రబాబుకు ఎన్నికల ఏడాదిలో జ్ఙానోదయమైనట్టుగా నటిస్తున్నట్టుగానే టిడిపి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలందరూ వ్యవహరిస్తున్నారు. ఇక బాబు భజన మీడియా కూడా అదే మ్యూజిక్ వినిపిస్తోంది. తాజాగా అఖిల ప్రియ కూడా మోడీపై విరుచుకుపడింది. దేశంలో జరుగుతున్న అత్యాచారాలన్నింటికీ మోడీనే బాధ్యుడు అనే రేంజ్‌లో మోడీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.

అయితే అఖిల ప్రియకు తెలుసో తెలియదో కానీ మహిళలపై దాడులు, అత్యాచారాల విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. అంతా కూడా 2014 ఎన్నికల ప్రచారంలో జనాల చెవుల తుప్పు వదిలేలా వచ్చిన ప్రకటనలో చెప్పినట్టుగానే ఆయన వచ్చాకే ఈ అగ్రస్థానం సాధించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి చంద్రబాబు అనే ఆయన సాధించిన ఈ ఘనత గురించి అఖిల ప్రియ ఏం చెప్తుందో చూడాలి. మోడీని తిట్టిన తిట్లన్నీ బాబుకు కూడా గట్టిగా తగుల్తున్నాయి. ఈ మధ్య చంద్రబాబుపై గరం గరంగా ఉన్న అఖిలప్రియ మోడీని విమర్శించే నెపంతో చంద్రబాబుపైనే ఎటాక్ చేసిందా అన్న సెటైర్స్ కూడా వినిపిస్తున్నాయి. దేశంలో అత్యాచారాల గురించి స్పందించడం బాగానే ఉంది కానీ ముందుగా అధికారంలోకి రావడానికి ఓట్లేసిన మహిళపై అత్యాచారాలు, దాడుల విషయంలో నాలుగేళ్ళుగా ఘోర వైఫల్యం చెందిన బాబు అండ్ కో పాలన గురించి కూడా మాట్లాడుకుంటే బాగుంటుందేమో. ఏమంటావు అఖిలప్రియా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -