మాతృత్వానికే మాయని మచ్చ తెచ్చింది ఓతల్లి. సభ్య సమాజం తల దించుకునేలా, అత్యంత దారుణంగా ప్రవర్తించింది. తన సుఖంకోసం కన్నకొడుకునే పొట్టన పెట్టుకుంది ఆ తల్లి రాక్షసి.కనీసం తల్లి అన్న మానవత్వాన్ని చూపించలేదు.పెల్లికి అడ్డు వస్తున్నాడని కన్నకొడుకును చంపేదానికి నీచమైన ఆలోచన చేసింది.కృష్ణా జిల్లాలో ఈ ఘోర సంగటన చోటు చేసుకుంది.
కృష్ణా జిల్లా ముళ్లపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ రెండో వివాహానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును చంపేసింది. అన్నంలో విషం కలిపి కుమారుడు అశోక్ కుమార్(5)కు తినిపించి హత్య చేసింది. బాబు మరణించిన అనంతరం కాలువలో పడేసి ఏమి తెలియనట్లు నటించింది. అనంతరం తన కుమారుడు కనిపించడం లేదని తొలుత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో, 27వ తేదీన బావిలో బాలుడి శవం ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా… విషప్రయోగం జరిగినట్టు తేలింది. దీంతో, బాలుడి తల్లి సుజాతను కస్టడీలోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
{loadmodule mod_custom,Side Ad 1}
రెండో వివాహానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతోనే కొడుకుని చంపేశానని ఆమె ఒప్పుకుంది. భర్తకు గత కొంతకాలంగా దూరంగా ఉన్న సుజాత… మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ నేపథ్యంలో, అతడిని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. కొడుకు అడ్డుగా ఉన్నాడనే నెపంతో ఏతల్లీ ఒడగట్టని దారునానికి ఒడిగట్టింది .
Related