మంచిగా చూసుకునే భర్త.. ముగ్గురు పిల్లలు.. సంతోషంగా సాగుతున్న కాపురంలో.. ఆ ఇల్లాలు వెయకుడని.. తప్పుటడుగులు వేసింది. దాంతో ఆ కుటుంబంలో సంతోషం పోయింది. ప్రియుడి మోజులో పడ్డ ఆమె.. తన పిల్లలను, భర్తను కాదని.. ప్రియుడితో బయటకు వెళ్లుంది. దాంతో ఆమె డబ్బులు ఖర్చయ్యాయి.
డబ్బు ఉంటనే సహజీవనం అంటూ ప్రియుడు ముఖం చాటేయడంతో.. ఇంటికి రాలేక హాస్టల్లో చేరింది. అంతటితో ఆగకుండా మహిళల పర్సులు, బంగారు గొలుసు కొట్టేస్తూ దొంగగా మారిపోయంది. చివరికి పోలీసులకు చిక్కింది. ఇలా భర్త, పిల్లల్ని కాదనుకుని ప్రియుడితో అందమైన లోకం లభిస్తుందనుకున్న ఆ మహిళకు జైలే మిగిలింది. వివరాల్లోకి వెళితే… నిజామాబాద్కు కె.పద్మ(29) కాలేజీ విద్య పూర్తిచేసింది. పదేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. సరదాలకు అలవాటు పడింది.
{loadmodule mod_custom,Side Ad 1}
పిల్లల్ని వదిలేసి ప్రియుడితో షికార్లుకు వెళ్ళేది. భర్త హెచ్చరించడంతో అతనని కాదనుకుంది. అమ్మ అంటూ.. పిల్లలు వెంటపడిన.. వద్దని బయటకు వెళ్లింది. ఆపై ప్రియుడు కె.పవన్కుమార్ (23)తో సహజీవనం చేయాలనుకుంది. కానీ పద్మను దిల్సుఖ్నగర్ గడ్డిఅన్నారంలో మానస ప్రగతి ఉమెన్స్ హాస్టల్లో స్టూడెంట్గా చేర్పించాడు. ఇంట్లో నుండి తెచ్చిన రూ.40 వేలు ఖర్చయ్యాయి. తినడానికి.. హాస్టల్ అద్దె కట్టడానికి డబ్బులేదు. ఇక ప్రియుడే ఆమెను దొంగగా మార్చేశాడు. ఇందులో భాగంగా బంగారు గొలుసులు, సెల్ ఫోన్లు, డబ్బుల్ని దొంగలించేది. బాధితులు వార్డెన్ ద్వారా మలక్పేట పీఎస్లో పద్మపై ఫిర్యాదు చేశారు. నిఘా వుంచిన పోలీసులు పక్కా ఆధారాలతో పద్మను, పవన్కుమార్ను క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అమెను జైలుకు పంపారు.
{youtube}D8TQRLoF09g{/youtube}
Related