- Advertisement -
అవును.మోడీ మానస ప్రాజెక్ట్ అయినటువంటి అహ్మదాబాద్ టు ముంబాయి బుల్లెట్ ట్రైన్ కు అక్షరాల 98,805 కోట్లుకావల్సి ఉంది.
505 కిలోమీటర్ల కారిడార్ ను ఈ ట్రైన్ కేవలం రెండు గంటల్లో అధిగమిస్తుంది. అది కూడా గంటకు 300 కి.మీ. వేగాన్ని అందుకుని.
ఇంతకు ముందు ఇదే దూరాన్ని చేరుకోవడం కోసం 7గంటల సమయం పట్టేది. మరి ఇంతలా తడిసి మోపయ్యే ఖర్చుతో… ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను ఎంత వరకు చేపడుతుందని బిజినెస్ వర్గాల్లో ఆసక్తి కరమైన చర్చ మొదలైంది.ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు చెందిన ఫైల్ ను జపాన్ అంబాసిడార్ టకేషి యాగీ మన రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభుకు న్యూ ఢిల్లీలో అంద చేశారు.